ETV Bharat / state

'ఎన్నికలైపోయాక 24 గంటల కరెంటు కూడా రాదు'

author img

By

Published : Apr 8, 2019, 12:29 PM IST

"కారు గుర్తుకు తప్ప ఎవరికి ఓటు వేసిన కల్యాణ లక్ష్మీ, పింఛను, రైతుబందు, రైతుబీమా ఏవీ రావు. ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి పథకాలైనా సరే అమలు కావంటూ ప్రజలను భయపెట్టి తెరాస నాయకులు ఓట్లు అడుగుతున్నారు ": డీకే అరుణ, మహబూబ్ నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి

'ఎన్నికలైపోయాక 24 గంటల కరెంటు కూడా రాదు'

తెలంగాణలో తెరాస 16 ఎంపీ సీట్లు కైవసం చేసుకోవాలని కలలు కంటున్నారని... అవి కలలు గానే మిగిలిపోతాయని మహబూబ్​నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేకపోయారని ఆరోపించారు. కేసీఆర్ కిట్లు ఎవరికీ అందడం లేదని, రెండో దఫా రైతుబంధు, రుణమాఫి డబ్బలు బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదన్నారు. ఇప్పటికీ ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత 24 గంటల విద్యుత్ బంద్ అవుతుందని జితేందర్ రెడ్డి జోస్యం చెప్పారు.

తెరాసకు వేస్తే ఓటు వృథా అయినట్లే

దేశ ప్రజలు మరోమారు ప్రధానిగా మోదీయే కావాలనుకుంటున్నారని మహబూబ్​నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ఈ ఎన్నికల్లో తెరాసకు ఓటేస్తే... వృథా అయినట్లేనని విమర్శించారు. మోదీ మెడలు వంచుతానంటున్న కేసీఆర్ మెడలు వంచాలంటే భాజపాకు ఓటేసి మోదీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనమైపోయిందని... వారు అధికారంలోకొచ్చినా సుస్థిరమైన పాలనను అందించలేరని పేర్కొన్నారు.

'ఎన్నికలైపోయాక 24 గంటల కరెంటు కూడా రాదు'

ఇవీ చదవండి: 'సత్తా ఉన్న అభ్యర్థులనే కాంగ్రెస్ బరిలోకి దింపింది'

తెలంగాణలో తెరాస 16 ఎంపీ సీట్లు కైవసం చేసుకోవాలని కలలు కంటున్నారని... అవి కలలు గానే మిగిలిపోతాయని మహబూబ్​నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేకపోయారని ఆరోపించారు. కేసీఆర్ కిట్లు ఎవరికీ అందడం లేదని, రెండో దఫా రైతుబంధు, రుణమాఫి డబ్బలు బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదన్నారు. ఇప్పటికీ ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత 24 గంటల విద్యుత్ బంద్ అవుతుందని జితేందర్ రెడ్డి జోస్యం చెప్పారు.

తెరాసకు వేస్తే ఓటు వృథా అయినట్లే

దేశ ప్రజలు మరోమారు ప్రధానిగా మోదీయే కావాలనుకుంటున్నారని మహబూబ్​నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ఈ ఎన్నికల్లో తెరాసకు ఓటేస్తే... వృథా అయినట్లేనని విమర్శించారు. మోదీ మెడలు వంచుతానంటున్న కేసీఆర్ మెడలు వంచాలంటే భాజపాకు ఓటేసి మోదీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనమైపోయిందని... వారు అధికారంలోకొచ్చినా సుస్థిరమైన పాలనను అందించలేరని పేర్కొన్నారు.

'ఎన్నికలైపోయాక 24 గంటల కరెంటు కూడా రాదు'

ఇవీ చదవండి: 'సత్తా ఉన్న అభ్యర్థులనే కాంగ్రెస్ బరిలోకి దింపింది'

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.