ETV Bharat / state

కరోనా కలకలం: మంత్రి సిబ్బందిలో ఒకరికి పాజిటివ్​

author img

By

Published : Jun 9, 2020, 11:56 AM IST

Updated : Jun 9, 2020, 3:06 PM IST

రాష్ట్ర మంత్రి భద్రతా సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. . ఆయనకు సన్నిహితంగా ఉన్నవారందరికి హోం క్వారంటైన్​కు తరలించారు.

మంత్రి భద్రతా ఇబ్బందిలో ఒకరికి కరోనా
మంత్రి భద్రతా ఇబ్బందిలో ఒకరికి కరోనా

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా జిల్లాకు చెందిన మంత్రి భద్రతా సిబ్బందిలో ఒకరికి కరోనా సోకింది. వనపర్తి, మహబూబ్​నగర్​ జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మహబూబ్​నగర్​లో నివాసముంటూ మంత్రి ఎస్కార్ట్​ వాహనంలో సదరు వ్యక్తి విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంగా ఉందని రిలీవయ్యారు. పరీక్షలు నిర్వహించగా.. అతనికి కరోనా ఉన్నట్లు తేలింది. ఆయనకు సన్నిహితంగా ఉంటూ విధుల్లో ఉన్నవారిని ప్రస్తుతం హోం క్వారంటైన్​కు తరలించే పనిలో పడ్డారు అధికారులు.

జిల్లాలో తాజాగా సోమవారం 4 కేసులు నమోదయ్యాయి. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఒకరికి కరోనా సోకగా.. ప్రైమరీ కాంటాక్ట్​ ఉన్న వారి కుటుంబసభ్యులకు పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్​ వచ్చింది. ఇక నాగర్​కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళకు కొవిడ్​ నిర్ధరణవగా.. ఆమె చికిత్స పొందుతూ మరణించింది. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఉప్పునూతల మండలానికి చెందిన 55 రోజుల బాబు మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయాడు.

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా జిల్లాకు చెందిన మంత్రి భద్రతా సిబ్బందిలో ఒకరికి కరోనా సోకింది. వనపర్తి, మహబూబ్​నగర్​ జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మహబూబ్​నగర్​లో నివాసముంటూ మంత్రి ఎస్కార్ట్​ వాహనంలో సదరు వ్యక్తి విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంగా ఉందని రిలీవయ్యారు. పరీక్షలు నిర్వహించగా.. అతనికి కరోనా ఉన్నట్లు తేలింది. ఆయనకు సన్నిహితంగా ఉంటూ విధుల్లో ఉన్నవారిని ప్రస్తుతం హోం క్వారంటైన్​కు తరలించే పనిలో పడ్డారు అధికారులు.

జిల్లాలో తాజాగా సోమవారం 4 కేసులు నమోదయ్యాయి. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఒకరికి కరోనా సోకగా.. ప్రైమరీ కాంటాక్ట్​ ఉన్న వారి కుటుంబసభ్యులకు పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్​ వచ్చింది. ఇక నాగర్​కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళకు కొవిడ్​ నిర్ధరణవగా.. ఆమె చికిత్స పొందుతూ మరణించింది. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఉప్పునూతల మండలానికి చెందిన 55 రోజుల బాబు మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయాడు.

ఇదీ చూడండి : ప్రతిధ్వని: స్కూళ్లు తెరుచుకుంటాయా.. తరగతుల నిర్వహణ సాధ్యమేనా?

Last Updated : Jun 9, 2020, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.