ETV Bharat / state

కరోనాతో తమ్ముడి మృతి.. గుండెపోటుతో అన్న మరణం - మహబూబ్​నగర్​లో తమ్ముడు అన్న మృతి

కరోనా మహమ్మారితో పోరాడుతూ ఆసుపత్రిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కాగా అంత్యక్రియల అనంతరం తన తమ్ముడి మరణాన్ని జీర్ణించుకోలేని అన్న గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలో చోటుచేసుకుంది.

brothers dead with the effect of corona in Mahabubnagar district
కరోనాతో తమ్ముడి మృతి.. గుండెపోటుతో అన్న మరణం
author img

By

Published : Aug 14, 2020, 7:38 AM IST

మహబూబ్​నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం పెద్ద వడ్డెమాన్ గ్రామంలోని ఓ కుటుంబంలో కరోనా మహమ్మారి విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పది రోజులుగా వైరస్​తో పోరాడుతూ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అతని ఆరోగ్య పరిస్థితి విషమించి బుధవారం దవాఖానాలోనే చనిపోయాడు. గురువారము కుటుంబ సభ్యులు కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ అతనికి స్వగ్రామంలో అంతక్రియలు నిర్వహించారు.

దహనసంస్కారాల అనంతరం ఇంటికి చేరుకున్న కాసేపటికే మృతుడి అన్న సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో చనిపోవడం వల్ల ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. ఒక్కరోజు వ్యవధిలోనే కరోనా కాటుతో తమ్ముడు.. తమ్ముడి మృతి జీర్ణించుకోలేక అన్న మరణంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

మహబూబ్​నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం పెద్ద వడ్డెమాన్ గ్రామంలోని ఓ కుటుంబంలో కరోనా మహమ్మారి విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పది రోజులుగా వైరస్​తో పోరాడుతూ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అతని ఆరోగ్య పరిస్థితి విషమించి బుధవారం దవాఖానాలోనే చనిపోయాడు. గురువారము కుటుంబ సభ్యులు కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ అతనికి స్వగ్రామంలో అంతక్రియలు నిర్వహించారు.

దహనసంస్కారాల అనంతరం ఇంటికి చేరుకున్న కాసేపటికే మృతుడి అన్న సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో చనిపోవడం వల్ల ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. ఒక్కరోజు వ్యవధిలోనే కరోనా కాటుతో తమ్ముడు.. తమ్ముడి మృతి జీర్ణించుకోలేక అన్న మరణంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

ఇదీ చూడండి: తమిళనాడులో మరో 5,835 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.