ETV Bharat / state

'కోర్టుకెక్కి ఉద్యోగం తెచ్చుకున్నాడు'

author img

By

Published : Aug 17, 2019, 6:39 AM IST

Updated : Aug 17, 2019, 7:25 AM IST

హైకోర్టు జోక్యంతో ఓ అంధుడికి ఉద్యోగం దక్కింది. మహబూబ్​నగర్​ జిల్లా కొల్లాపూర్​కు చెందిన జి.మురళీధర్​కు... జిల్లాకేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్​గా ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

'కోర్టుకెక్కి ఉద్యోగం తెచ్చుకున్నాడు'

ఆసుపత్రి వర్గాల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యంతో విసుగుచెందిన ఓ అంధుడు హైకోర్టును ఆశ్రయించి ఉద్యోగం తెచ్చుకున్నాడు. మహబూబ్​నగర్​ జిల్లా కొల్లాపూర్​కు చెందిన జి.మురళీధర్ మహిళ సంక్షేమ శాఖలో దివ్యాంగుల కోటాలో నాలుగో గ్రేడ్ బ్యాక్ లాగ్ టైపిస్టు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దరఖాస్తుదారుల్లో మొదటి స్థానంలో నిలిచి.. ఉద్యోగానికి అర్హత సాధించారు. అయితే మురళీధర్ దృష్టిలోపం ఎంత శాతం ఉందో తేల్చాలని అప్పటి కలెక్టర్ రోనాల్డ్ రాస్.. సరోజినిదేవి కంటిఆసుపత్రి సూపరింటెండెంట్​కు పంపించారు. కానీ ఆస్పత్రి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తాను 40శాతం కంటిచూపు లోపంతో బాధపడుతున్నానని.. అయితే ఆసుపత్రి వైద్యులు నివేదిక సమర్పించడం లేదని.. మురళీధర్​ హైకోర్టును ఆశ్రయించారు. రెండు నెలల్లోగా బాధితుడికి పరీక్షలు చేసి నివేదిక ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్​ను న్యాయస్థానం ఆదేశించి.. దాని ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్​కు స్పష్టం చేసింది.

'కోర్టుకెక్కి ఉద్యోగం తెచ్చుకున్నాడు'

రెండు నెలలు దాటినప్పటికీ... సరోజిని ఆస్పత్రి వైద్యులు పరీక్షించి నివేదిక ఇవ్వలేదు దీనితో మురళీధర్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. కలెక్టర్ రోనాల్డ్ రాస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీందర్ గౌడ్​పై కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు. అధికారులు వెనక్కి తగ్గి మురళీధర్​కు మహబూబ్​నగర్ జిల్లా పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్​గా ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చూడండి: ప్రభుత్వానికి ఆస్పత్రులకు మధ్య లెక్కల్లో చిక్కు!

ఆసుపత్రి వర్గాల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యంతో విసుగుచెందిన ఓ అంధుడు హైకోర్టును ఆశ్రయించి ఉద్యోగం తెచ్చుకున్నాడు. మహబూబ్​నగర్​ జిల్లా కొల్లాపూర్​కు చెందిన జి.మురళీధర్ మహిళ సంక్షేమ శాఖలో దివ్యాంగుల కోటాలో నాలుగో గ్రేడ్ బ్యాక్ లాగ్ టైపిస్టు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దరఖాస్తుదారుల్లో మొదటి స్థానంలో నిలిచి.. ఉద్యోగానికి అర్హత సాధించారు. అయితే మురళీధర్ దృష్టిలోపం ఎంత శాతం ఉందో తేల్చాలని అప్పటి కలెక్టర్ రోనాల్డ్ రాస్.. సరోజినిదేవి కంటిఆసుపత్రి సూపరింటెండెంట్​కు పంపించారు. కానీ ఆస్పత్రి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తాను 40శాతం కంటిచూపు లోపంతో బాధపడుతున్నానని.. అయితే ఆసుపత్రి వైద్యులు నివేదిక సమర్పించడం లేదని.. మురళీధర్​ హైకోర్టును ఆశ్రయించారు. రెండు నెలల్లోగా బాధితుడికి పరీక్షలు చేసి నివేదిక ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్​ను న్యాయస్థానం ఆదేశించి.. దాని ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్​కు స్పష్టం చేసింది.

'కోర్టుకెక్కి ఉద్యోగం తెచ్చుకున్నాడు'

రెండు నెలలు దాటినప్పటికీ... సరోజిని ఆస్పత్రి వైద్యులు పరీక్షించి నివేదిక ఇవ్వలేదు దీనితో మురళీధర్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. కలెక్టర్ రోనాల్డ్ రాస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీందర్ గౌడ్​పై కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు. అధికారులు వెనక్కి తగ్గి మురళీధర్​కు మహబూబ్​నగర్ జిల్లా పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్​గా ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చూడండి: ప్రభుత్వానికి ఆస్పత్రులకు మధ్య లెక్కల్లో చిక్కు!

TG_HYD_12_17_BLIND_GOT_JOB_BY_HC_AB_3064645 REPORTER: Nageshwara Chary ( ) ఉన్నత న్యాయస్థానం జోక్యంతో ఓ అంధుడికి ఉద్యోగం దక్కింది. కొల్లాపూర్ కు చెందిన జి.మురళీధర్ మహిళ సంక్షేమ శాఖలో దివ్యాంగుల కోటాలో నాలుగో గ్రేడ్ బ్యాక్ లాగ్ టైపిస్టు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దరఖాస్తుదారుల్లో మొదటి స్థానంలో నిలిచి.. ఉద్యోగానికి అర్హత సాధించారు. అయితే మురళీధర్ దృష్టిలోపం ఎంత శాతం ఉందో తేల్చాలని అప్పటి కలెక్టర్ రోనాల్డ్ రాస్.. సరోజిని దేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ కు పంపించారు. కానీ సరోజిని దేవి కంటి ఆస్పత్రి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో... మురళీధర్ హైకోర్టును ఆశ్రయించారు. తాను 40శాతం కంటిచూపు లోపంతో బాధపడుతున్నానని.. అయితే ఆస్పత్రి వైద్యులు నివేదిక సమర్పించడం లేదని.. కనీసం పరీక్షలు చేయడం లేదని తన న్యాయవాది పాండు ద్వారా హైకోర్టుకు వివరించారు. స్పందించిన హైకోర్టు... రెండు నెలల్లోగా మురళీధర్ కు పరీక్షలు జరిపి నివేదిక ఇవ్వాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించి.. దాని ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ కు స్పష్టం చేసింది. అయితే రెండు నెలలు దాటినప్పటికీ... సరోజిని ఆస్పత్రి వైద్యులు పరీక్షించి నివేదిక ఇవ్వకపోవడంతో... మురళీధర్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి కలెక్టర్ రోనాల్డ్ రాస్, ఆస్పత్రి సూపరింటెండెంట్ రవీందర్ గౌడ్ పై కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు. దీంతో అధికారులు వెనక్కి తగ్గి మురళీధర్ కు మహబూబ్ నగర్ జిల్లా పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మురళీధర్ కు ఉద్యోగం ఇచ్చినట్లు చెప్పడంతో... ఉన్నత న్యాయస్థానం కోర్టు ధిక్కరణ కేసుపై విచారణ ముగించింది. బైట్ మురళీధర్, హైకోర్టును ఆశ్రయించి ఉద్యోగం పొందిన వ్యక్తి బైట్ డీఎల్ పాండు, మురళీధర్ తరఫు న్యాయవాది
Last Updated : Aug 17, 2019, 7:25 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.