మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు డిపోల ఎదుట బైఠాయించగా బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. మహబూబాబాద్కు చెందిన డ్రైవర్ నరేష్ బుధవారం చేసుకున్న ఆత్మహత్యకు నిరసనగా ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష పార్టీల శ్రేణులు జిల్లావ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొండిగా వ్యవహరిస్తూ ఆర్టీసీ కార్మికుల చావుకు కారణమవుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కార్మిక సంఘ నేతలను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండిః తాగి రెచ్చిపోయిన గల్లీ లీడర్లు.. జై కొట్టిన పోలీసులు