మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ కేంద్రంలో మహిళలకు స్త్రీనిధి రుణాల చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు... మహిళలకు చెక్కులు అందించారు.
మహిళలకి ఉపాధి, గౌరవం, ప్రాధాన్యతను ఇచ్చిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. పాలకుర్తి నియోజవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, రాష్ట్ర స్త్రీ నిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'వారందరికీ అందేంతవరకు పల్స్ పోలియో కార్యక్రమం'