మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మెట్ల తిమ్మాపురం శివారులో మావోయిస్టు సానుభూతి పరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కార్యదర్శి హరిభూషణ్కు కొరియర్లుగా వ్యవహరిస్తున్న భూమయ్య, శ్రీనులుగా పోలీసులు తెలిపారు. వీరి నుంచి 6 మందుపాతరలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. ఈ ఇద్దరు మావోయిస్టులు నీలమయ గుట్టల ప్రాంతానికి వచ్చినప్పుడు ఆహార సామగ్రి, దుస్తులు అందించేవారని, అనారోగ్యానికి గురైతే తమ ఇంట్లోనే వైద్యం చేయించేవారని గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. భూమయ్యపై 9 కేసులు ఉన్నాయని, ఈయన హరిభూషణ్కు పెద్దనాన్న అని తెలిపారు.
ఇవీ చూడండి: కొండగట్టులో మహిళ దారుణ హత్య