ETV Bharat / state

'సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

author img

By

Published : Apr 23, 2020, 7:45 PM IST

కరోనా నియంత్రణకు ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ను అందరూ పాటించాలని మహబూబాబాద్​ జిల్లా కలెక్టర్​ గౌతమ్​ సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

collector gautham at vemulapalli check post
వేములపల్లి చెక్​పోస్టు వద్ద కలెక్టర్ తనిఖీ

సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్​ గౌతమ్​ సూచించారు. అనవసరంగా ఎవరూ బయటకు రావద్దన్నారు. మరిపెడ మండలం తానంచర్ల, రాంపురం, దంతాలపల్లి మండలం వేములపల్లి శివారులో ఏర్పాటు చేసిన చెక్​పోస్టులను తనిఖీ చేశారు.

సూర్యాపేటలో కరోనా వైరస్ ప్రబలినందున ఆ జిల్లా నుంచి మహబూబాబాద్ జిల్లాకు రాకపోకలు నిలిపివేయాలని కలెక్టర్​ గౌతమ్​ అధికారులను ఆదేశించారు. లాక్​డౌన్​ నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.

సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్​ గౌతమ్​ సూచించారు. అనవసరంగా ఎవరూ బయటకు రావద్దన్నారు. మరిపెడ మండలం తానంచర్ల, రాంపురం, దంతాలపల్లి మండలం వేములపల్లి శివారులో ఏర్పాటు చేసిన చెక్​పోస్టులను తనిఖీ చేశారు.

సూర్యాపేటలో కరోనా వైరస్ ప్రబలినందున ఆ జిల్లా నుంచి మహబూబాబాద్ జిల్లాకు రాకపోకలు నిలిపివేయాలని కలెక్టర్​ గౌతమ్​ అధికారులను ఆదేశించారు. లాక్​డౌన్​ నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.