నిర్మల్ జిల్లాలో పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో కలిసి విమానంలో ప్రయాణించిన మహబూబాబాద్ జిల్లాకు చెందిన పది మందికి కరోనా నెగిటివ్గా నిర్ధరణ అయిందని కలెక్టర్ వీపీ గౌతం తెలిపారు. నగదు అవసరం ఉన్నవారే బ్యాంకుల వద్దకు రావాలని ప్రజలను కలెక్టర్ కోరారు. బ్యాంకుల ఎదుట గుమిగూడడం లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు. గ్రామాల్లో కూలీలు ఇబ్బందిపడకుండా ఉపాధి హామీ పథకం పనులను ప్రారంభించామని తెలిపారు. జిల్లాలో 18వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. భౌతిక దూరం పాటించాలని కూలీలకు సూచించారు.
జిల్లా లోపల ఐదు చెక్పోస్ట్లు, సరిహద్దుల్లో మరో ఐదు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. సరిహద్దు జిల్లాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నందుకు మరికొన్ని చెక్పోస్టులు ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 79 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. 5,355 వాహనాలను సీజ్ చేశామని పేర్కొన్నారు.
ఇవీచూడండి: ఒకే కుటుంబంలో 31 కేసులు