పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదులపూసపల్లిని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్. పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం మొదలై 4 రోజులు గడిచినప్పటికీ పారిశుద్ధ్య పనులు జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
వార్డులోని సమస్యలు గుర్తించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారోబార్ శ్రీనివాస్ను విధుల నుంచి సస్పెండ్ చేయాలని మునిసిపల్ కమీషనర్ను ఆదేశించారు. పర్యవేక్షణలో విఫలమైనందుకు వార్డ్ ప్రత్యేక అధికారి అయిన జిల్లా సంక్షేమ అధికారి సంధ్యా రాణికి మెమో జారీ చేశారు. వార్డులో చేయవలసిన పనులు, సమస్యలను వెంటనే గుర్తించి నివేదించాలని మునిసిపల్ కమిషనర్ను ఆదేశించారు.
ఇవీ చూడండి: గబ్బర్సింగ్ పెళ్లి సీన్ రిపీట్... పీటల మీది నుంచి వెళ్లిపోయిన వధువు