ETV Bharat / state

ప్రభుత్వ ఆస్పత్రిలో డీహెచ్​ఎమ్​వో తనిఖీలు

మహబూబాబాద్​ జిల్లా దంతాలపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్​ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. గర్భిణుల వివరాలను నమోదు చేయడంపట్ల నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

author img

By

Published : May 25, 2019, 9:09 AM IST

డీఎంహెచ్​వో ఆకస్మిక తనిఖీలు

మహబూబాబాద్​ జిల్లా వైద్యాధికారి డా. శ్రీరామ్​ దంతాలపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని పలు రికార్డులు పరిశీలించారు. గర్భిణీల వివరాలను నమోదు చేయడం పట్ల నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బంది తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్​ నెలకు సంబంధించి 94 మంది గర్భిణుల వివరాలు ఆన్​లైన్లో నమోదు చేయాల్సి ఉండగా 44 మంది వివరాలు మాత్రమే ఉన్నాయి. విధులు సరిగా నిర్వర్తించని ఇద్దరు వైద్య అధికారులు, సీహెచ్​తో పాటు సూపర్​వైజర్​, ఏఎన్​ఎంలకు మెమోలు జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వైద్య సిబ్బంది ఆరోగ్య ఉపకేంద్రాలను అందుబాటులో ఉంచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని శ్రీరామ్​ కోరారు.

డీఎంహెచ్​వో ఆకస్మిక తనిఖీలు

మహబూబాబాద్​ జిల్లా వైద్యాధికారి డా. శ్రీరామ్​ దంతాలపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని పలు రికార్డులు పరిశీలించారు. గర్భిణీల వివరాలను నమోదు చేయడం పట్ల నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బంది తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్​ నెలకు సంబంధించి 94 మంది గర్భిణుల వివరాలు ఆన్​లైన్లో నమోదు చేయాల్సి ఉండగా 44 మంది వివరాలు మాత్రమే ఉన్నాయి. విధులు సరిగా నిర్వర్తించని ఇద్దరు వైద్య అధికారులు, సీహెచ్​తో పాటు సూపర్​వైజర్​, ఏఎన్​ఎంలకు మెమోలు జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వైద్య సిబ్బంది ఆరోగ్య ఉపకేంద్రాలను అందుబాటులో ఉంచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని శ్రీరామ్​ కోరారు.

డీఎంహెచ్​వో ఆకస్మిక తనిఖీలు
Intro:జై వెంకటేశ్వర్లు డోర్నకల్ 8008574820
........... ............ ......
TG_WGL_28_24_DMHO_THANIKEE_AV_G1
........... ....?..... ....
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీ రామ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు . ఆస్పత్రిలోని పలు రికార్డులను పరిశీలించారు. వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గర్భిణీల వివరాలను నమోదు తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. గర్భిణుల వివరాలను నమోదు చేయడం పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పి హెచ్ సి పరిధిలోని దంతాలపల్లి నరసింహుల పేట మండలాల్లో ఏప్రిల్ నెలకు సంబంధించి 94 మంది గర్భిణులకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉండగా వైద్య సిబ్బంది కేవలం 44 మంది వివరాలు మాత్రమే నమోదు చేశారు. మిగతా 50 మంది వివరాలు నమోదు చేయకపోవడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్య అధికారులు, సిహెచ్ తో పాటు సూపర్వైజర్ ర్ ఏఎన్ఎంలకు మెమోలు జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచడానికి వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు.
విధులపై నిర్లక్ష్యం వహించడం తగదన్నారు.
వైద్య సిబ్బంది ఆరోగ్య ఉపకేంద్రాలు అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.


Body:ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ


Conclusion:ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.