కుమురం భీం జిల్లా కాగజ్నగర్లో క్షయ అధ్యయన శిబిరాన్ని... పట్టణ ఎస్ఎచ్ఓ మోహన్, పురపాలిక కమిషనర్ శ్రీనివాస్ ప్రారంభించారు. కేంద్రీయ క్షయ విభాగం, జాతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ... ప్రపంచ ఆరోగ్య సంస్థల సహకారంతో ఈ పరిశోధన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరంలో పట్టణంలో ఎంపిక చేసిన 4 వార్డుల ప్రజలకు పరీక్షలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ అధ్యయనంలో శ్వాస సంబంధిత క్షయ వ్యాధి తీవ్రతను అంచనా వేయనున్నట్లు తెలిపారు. పరిశోధన జరిపిన సమూహాలలో ఛాతి నొప్పి లక్షణాలు గుర్తించినట్లు పేర్కొన్నారు. క్షయ రోగులను గుర్తించి... వారికి ఉచితంగా వైద్యం అందించే ఏర్పట్లు చేయనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ పరీక్షల్లో పట్టణ వాసులు పాల్గొని సహకరించాలని కమిషనర్ శ్రీనివాస్ కోరారు.

ఇదీ చదవండి: ప్రభుత్వ సహకారంతోనే న్యాయవాద దంపతుల హత్య: సంజయ్