అసిఫాబాద్ రవాణా కార్యాలయంలో తనిఖీలు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ కుమురం భీం ఆసిఫాబాద్లోని అంకుశాపూర్ రవాణా కార్యాలయాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో సిబ్బంది కొరత ఉన్నట్లు అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయ లక్ష్యాలు సాధించిన ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు. మొత్తం రూ. 21 కోట్ల ఆదాయ లక్ష్యం ఉండగా రూ. 17 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. పారదర్శకత కోసం అమలు చేస్తున్న ఆన్లైన్ విధానం సక్రమంగా అమలు జరగడం లేదని విలేకరులు ప్రశ్నించగా తమ దృష్టికి వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇవీ చూడండి:అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తెరాస ప్రభుత్వ లక్ష్యం