ETV Bharat / state

'పక్షం రోజులైంది... మాకేం న్యాయం చేశారు?' - టేకు లక్ష్మి హత్య ఘటనలో న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం ఆందోళన

ఈ మధ్య కాలంలో జరిగిన దిశ హత్య కేసులో నిందితులను కొన్ని రోజుల్లోనే శిక్షించారు. మరి టేకు లక్ష్మి హత్యోదంతం జరిగి పక్షం రోజులైనా ఇప్పటికీ కేసులో ఎలాంటి పురోగతి లేదంటూ టేకు లక్ష్మి కుటుంబీకులు ప్రశ్నిస్తున్నారు. వాళ్లకో న్యాయం... మాకో న్యాయమా అని ప్రశ్నిస్తూ కుల సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తున్నారు.

Teku Lakshmi family, cast leaders protest to do justice
'పక్షం రోజులైంది... మాకేం న్యాయం చేశారు?'
author img

By

Published : Dec 9, 2019, 12:13 AM IST

టేకు లక్ష్మి హత్యోదంతంపై పురోగతి లేదంటూ కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం రామ్ నాయక్ తండ-ఎల్లపటార్ గ్రామాల మధ్య గత నెల 24న జరిగిన టేకు లక్ష్మి హత్య ఘటన తెలిసిందే..

ఘటన జరిగి పక్షం రోజులు అయినప్పటికీ కేసులో పురోగతి లేదని ప్రజాసంఘాల సంఘాలు, కుల సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆసిఫాబాద్​ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు ధర్నా చేశారు. నిందితులను వెంటనే శిక్షించాలంటూ నినదించారు.

నిత్యం ధర్నాలు

కొన్ని రోజులుగా టేకు లక్ష్మి కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలి.. నిందితులను వెంటనే శిక్షించాలంటూ లింగాపూర్​, సిరిపూర్​ యూ, జైనూర్​ మండలాల్లో కులం సంఘాల నేతలు, స్థానికులు ధర్నాలు చేస్తున్నారు.

వాళ్లకో న్యాయం... మాకో న్యాయమా?

దిశ కేసులో నిందితులను శిక్షించిన పోలీసులు.. లక్ష్మి హత్య ఘటనలో నిందితులను ఎందుకు శిక్షించడం లేదని బాధిత కుటుంబీకులు ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం జరగకపోతే దిల్లీ వరకు పాదయాత్ర చేసి తమ సమస్యను దేశం మొత్తానికి తెలియజేస్తామన్నారు. ఇప్పడికైనా అధికారులు, నేతలు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తున్నారు.

'పక్షం రోజులైంది... మాకేం న్యాయం చేశారు?'

ఇదీ చూడండి: దిశ నిందితుల ఎన్​కౌంటర్ సరికాదు: డి.రాజా

టేకు లక్ష్మి హత్యోదంతంపై పురోగతి లేదంటూ కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం రామ్ నాయక్ తండ-ఎల్లపటార్ గ్రామాల మధ్య గత నెల 24న జరిగిన టేకు లక్ష్మి హత్య ఘటన తెలిసిందే..

ఘటన జరిగి పక్షం రోజులు అయినప్పటికీ కేసులో పురోగతి లేదని ప్రజాసంఘాల సంఘాలు, కుల సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆసిఫాబాద్​ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు ధర్నా చేశారు. నిందితులను వెంటనే శిక్షించాలంటూ నినదించారు.

నిత్యం ధర్నాలు

కొన్ని రోజులుగా టేకు లక్ష్మి కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలి.. నిందితులను వెంటనే శిక్షించాలంటూ లింగాపూర్​, సిరిపూర్​ యూ, జైనూర్​ మండలాల్లో కులం సంఘాల నేతలు, స్థానికులు ధర్నాలు చేస్తున్నారు.

వాళ్లకో న్యాయం... మాకో న్యాయమా?

దిశ కేసులో నిందితులను శిక్షించిన పోలీసులు.. లక్ష్మి హత్య ఘటనలో నిందితులను ఎందుకు శిక్షించడం లేదని బాధిత కుటుంబీకులు ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం జరగకపోతే దిల్లీ వరకు పాదయాత్ర చేసి తమ సమస్యను దేశం మొత్తానికి తెలియజేస్తామన్నారు. ఇప్పడికైనా అధికారులు, నేతలు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తున్నారు.

'పక్షం రోజులైంది... మాకేం న్యాయం చేశారు?'

ఇదీ చూడండి: దిశ నిందితుల ఎన్​కౌంటర్ సరికాదు: డి.రాజా

Intro:పక్షం రోజులైనా పురోగతి లేని టేకు లక్ష్మి కేసు......

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలో రామ్ నాయక్ తండ-ఎల్లపటార్ గ్రామాల మధ్యలో జరిగిన టేకు లక్ష్మి అత్యాచారం హత్య ఘటన పక్షం రోజులైనా పురోగతి లేదని ప్రజలు, కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు..

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం లో సాయి పేట గ్రామానికి చెందిన టేకు లక్ష్మి దంపతులు వారి ఇద్దరు పిల్లలతో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలానికి గత ఐదు సంవత్సరాల క్రితం జీవన కొనసాగించడానికి వలస వచ్చారు. భార్య భర్తలు ఇరువురు పిన్నీసులు, గాలి బుడగలు, స్త్రీల అలంకరణ వస్తువులు చిన్న చిన్న గ్రామాలలో తిరుగుతూ అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.

రోజువారీ గానే గత నెల 24న లింగాపూర్ మండలం రామ్ నాయక్ తండ-ఎల్లపటర్ గ్రామాలకు వస్తువులను అమ్మడానికి ఉదయాన్నే ద్విచక్ర వాహనంతో భార్య భర్తలు బయలుదేరారు. భార్య టేకు లక్ష్మిని రామ్ నాయక్ తండా లో వదిలేసి తాను కూడా వ్యాపారం చేస్తూ ముందు గ్రామాలకు వెళ్లి పోయాడు. భార్యకు మధ్యాహ్నం రెండు గంటల వరకు తిరిగి వస్తానని చెప్పి బయలుదేరాడు. వ్యాపారము ముగించుకొని మధ్యాహ్నం గోపి తిరిగి వచ్చాడు కానీ తన భార్య టేకు లక్ష్మీ కనబడక పోవడంతో ఆందోళనకు గురి అయ్యాడు. వారి బంధువుల ఇళ్లలో వెళ్లి చూడడంతో వారు రాలేదు అని సమాధానం చెప్పడంతో ఇంకా భయాందోళనకు గురి అయ్యాడు. టేకు లక్ష్మి వ్యాపారం చేస్తూ ముందు గ్రామాలకు వెళ్లే సమయంలో మార్గమధ్యంలో ముగ్గురు నిందితులు అడ్డుకున్నారు. సాయంత్రం వరకు కూడా భార్య ఆచూకీ తెలియకపోవడంతో లింగాపూర్ పోలీస్ స్టేషన్లో కనబడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సాయంత్రం వరకు వెతికినా ఫలితం కనబడలేదు. మరుసటి రోజు 25న ఉదయం నుండి ఫిర్యాదు దారుడు గోపి, ప్రజలు, పోలీసులు కాటన్ ప్రారంభించారు. ఈ రెండు గ్రామాల మధ్యలో రోడ్డు పక్కనే చెట్ల పొలాల్లో రక్తపుమడుగులో పడి ఉన్నట్లు గుర్తించారు. ముగ్గురు నిందితులు ఆమెను అత్యాచారం చేసి, హత్య చేసి అప్పటికే పారిపోయారు. ఆమె తలపై బండతో మోదీ, కత్తితో వేళ్లను, గొంతుకోసి పారిపోయినట్లు నిందితులు పోలీసులకు తెలిపారు.
దీనిలో భాగంగా 25న బ్లూ కోట్ పోలీస్ లు వాహనాలను చెక్ చేస్తుండగా అనుమానాస్పదంగా కనబడిన వారిని ఆదిలాబాద్ క్రాస్ రోడ్ వద్ద కనబడటంతో ఈ ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. వీరిని డిఎస్పి సత్యనారాయణకు అప్పగించారు.

భర్తకు భార్య, భార్యకు భర్త ఆ కుటుంబానికి ఆసరాగా ఉంటారు అనుకున్న సమయంలో ఈ ఘటన తో ఒక్కసారిగా ఆ కుటుంబం కుప్పకూలిపోయి విషాదఛాయలు అలుముకున్నాయి. వారి ఇద్దరు పిల్లలకు తల్లి లేని పిల్లలని అయ్యారు. పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పిల్లలకు ఏమని చెప్పాలో తెలియని పరిస్థితిలో తండ్రి సతమతమవుతున్నారు.

బాధిత కుటుంబానికి ఘటన జరిగి పక్షం రోజులు అయినప్పటికీ కేసులో పురోగతి సాధించ లేదని పలువురు, ప్రజాసంఘాల సంఘాల నాయకులు, కుల సంఘాలు కుటుంబ సభ్యులు న్యాయం అందేలా లేదని అంటున్నారు.
నాలుగు రోజుల తర్వాత జరిగిన దిశ కేసులో పోలీసులు పురోగతి సాధించారు కానీ నీ కంటే నాలుగు రోజుల ముందు జరిగిన టేకు లక్ష్మీ విషయంలో ఎలాంటి పురోగతి లేదని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. తో ప్రజలు అసహనం చెంది ధర్నాలు ,రాస్తారోకోలు ,వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పెట్టి రోడ్ ఎక్కుతున్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా నిరసనలు జ్వాలలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

టేకు లక్ష్మి ఘటన పక్షం రోజులైనా కేసు విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఘటనాస్థలానికి డీకే అరుణ మాజీ మంత్రి ఈ విషయంపై స్పందించి విషయాలను ఆరా తీయడానికి రేపు ఘటనాస్థలానికి రానున్నారు.
జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాBody:tg_adb_25_08_paksham_rojulaina_purogati_leni_teku_laxmi_casu_avb_ts10078_HDConclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.