ETV Bharat / state

'గిరిజనుల సంక్షేమంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ' - సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తాజా వార్తలు

కుమురం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో మంత్రి సత్యవతి రాఠోడ్ పర్యటించారు. ఎన్జీఓ కాలనీలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల భవన సముదాయనికి శంకుస్థాపన చేశారు. గిరిజనుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర కృషి చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

Minister satyavathi laying the foundation stone for the Ekalavya Model Residential School Building Complex in sirpoor
'గిరిజనుల సంక్షేమంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ'
author img

By

Published : Feb 20, 2021, 12:28 PM IST

'గిరిజనులు అభివృద్ధికి విద్య ఒక్కటే మార్గమని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని' గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. కుమురం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని ఎన్జీఓ కాలనీలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల భవన సముదాయనికి శంకుస్థాపన చేశారు. మంత్రికి సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఘన స్వాగతం పలికారు. రూ.33 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు.

గిరిజనుల సంక్షేమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని మంత్రి అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలను నెలకొల్పారన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్​, కుమురం భీం జిల్లా పరిషత్​ ఛైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కలెక్టర్ రాహుల్ రాజ్, ఐటీడీఏ పీఓ భవేశ్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

'గిరిజనులు అభివృద్ధికి విద్య ఒక్కటే మార్గమని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని' గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. కుమురం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని ఎన్జీఓ కాలనీలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల భవన సముదాయనికి శంకుస్థాపన చేశారు. మంత్రికి సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఘన స్వాగతం పలికారు. రూ.33 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు.

గిరిజనుల సంక్షేమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని మంత్రి అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలను నెలకొల్పారన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్​, కుమురం భీం జిల్లా పరిషత్​ ఛైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కలెక్టర్ రాహుల్ రాజ్, ఐటీడీఏ పీఓ భవేశ్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.