ETV Bharat / state

కుమురంభీం జిల్లాలో అక్రమ కలప పట్టివేత

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాలోని ఉట్నూర్​ నుంచి మంచిర్యాలకు అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీ శాఖాధికారులు పట్టుకున్నారు. టవేరా వాహనంతో పాటు రూ. 30 వేల విలువైన 8 కలప దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్​ చేశారు.

కుమురంభీం జిల్లాలో అక్రమ కలప పట్టివేత
కుమురంభీం జిల్లాలో అక్రమ కలప పట్టివేత
author img

By

Published : Jun 21, 2020, 7:06 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా ఉట్నూర్​ నుంచి మంచిర్యాలకు అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీ శాఖాధికారులు పట్టుకున్నారు. కలప తరలిస్తున్న వాహనాన్ని, ఇద్దరు వ్యక్తులను జిల్లా కేంద్రంలోని అటవీ చెక్​పోస్ట్​ వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్​ శ్రీనివాస్​ రెడ్డితో కలిసి ఆసిఫాబాద్​ ఎఫ్​ఆర్​వో అప్పలకొండ అదుపులోకి తీసుకున్నారు.

ఉట్నూర్ నుంచి మంచిర్యాలకు డీఎస్​4సీఏడీ0708 టవేరాలో అక్రమంగా కలప తరలుతుందన్న పక్కా సమాచారంతో దాడిచేసి వాహనాన్ని పట్టుకున్నామని అప్పలకొండ తెలిపారు. రూ. 30 వేల విలువైన 8 కలప దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నామన్నారు. అక్రమంగా కలప తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా ఉట్నూర్​ నుంచి మంచిర్యాలకు అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీ శాఖాధికారులు పట్టుకున్నారు. కలప తరలిస్తున్న వాహనాన్ని, ఇద్దరు వ్యక్తులను జిల్లా కేంద్రంలోని అటవీ చెక్​పోస్ట్​ వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్​ శ్రీనివాస్​ రెడ్డితో కలిసి ఆసిఫాబాద్​ ఎఫ్​ఆర్​వో అప్పలకొండ అదుపులోకి తీసుకున్నారు.

ఉట్నూర్ నుంచి మంచిర్యాలకు డీఎస్​4సీఏడీ0708 టవేరాలో అక్రమంగా కలప తరలుతుందన్న పక్కా సమాచారంతో దాడిచేసి వాహనాన్ని పట్టుకున్నామని అప్పలకొండ తెలిపారు. రూ. 30 వేల విలువైన 8 కలప దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నామన్నారు. అక్రమంగా కలప తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఇదీ చూడండి: పసిడి వన్నెలో కనువిందు చేస్తున్న గ్రహణ సూర్యుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.