ETV Bharat / state

కస్తూర్బా పాఠశాలలో జిల్లా విద్యాధికారి విచారణ

బెజ్జురు కస్తూర్బా విద్యార్థినుల ఆందోళన రెండో రోజూ కొనసాగింది. వీరికి మద్దతుగా తల్లిదండ్రులు కూడా ధర్నాకు దిగారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్న ఎస్​ఓను తొలగించాలంటూ డిమాండ్​ చేశారు. స్పందించిన జిల్లా విద్యాధికారి భిక్షపతి విచారణకు ఆదేశించారు.

author img

By

Published : Mar 13, 2019, 6:30 AM IST

Updated : Mar 13, 2019, 8:33 AM IST

విద్యార్థుల సమస్యలను తెలుసుకుంటున్న జిల్లా విద్యాధికారి
విద్యార్థుల సమస్యలను తెలుసుకుంటున్న జిల్లా విద్యాధికారి
కుమురం భీం జిల్లా బెజ్జురు మండలం కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదంటూవిద్యార్థినులు స్వీయ నిర్బంధం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాల ముందు ధర్నా చేశారు. నిర్లక్ష్యం వహిస్తున్న ఎస్.ఓ అమూల్యను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

జిల్లా విద్యాధికారి భిక్షపతి జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యను తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని.. రోజు అల్పాహారం కిచిడి పెడుతున్నారని విద్యార్థినులుతెలిపారు. మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం బదులు దొడ్డు బియ్యం వడ్డిస్తున్నారని అన్నారు. ఆహార పట్టిక ప్రకారం తమకు భోజనం ఎందుకు పెట్టడం లేదని ఎస్.ఓ. అమూల్యను అడిగితే తమను కొట్టి తిడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికల నుంచి లిఖిత పూర్వక ఫిర్యాదు తీసుకున్నారు. అనంతరం సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: వేసవికి ముందే అడుగంటేశాయి

విద్యార్థుల సమస్యలను తెలుసుకుంటున్న జిల్లా విద్యాధికారి
కుమురం భీం జిల్లా బెజ్జురు మండలం కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదంటూవిద్యార్థినులు స్వీయ నిర్బంధం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాల ముందు ధర్నా చేశారు. నిర్లక్ష్యం వహిస్తున్న ఎస్.ఓ అమూల్యను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

జిల్లా విద్యాధికారి భిక్షపతి జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యను తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని.. రోజు అల్పాహారం కిచిడి పెడుతున్నారని విద్యార్థినులుతెలిపారు. మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం బదులు దొడ్డు బియ్యం వడ్డిస్తున్నారని అన్నారు. ఆహార పట్టిక ప్రకారం తమకు భోజనం ఎందుకు పెట్టడం లేదని ఎస్.ఓ. అమూల్యను అడిగితే తమను కొట్టి తిడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికల నుంచి లిఖిత పూర్వక ఫిర్యాదు తీసుకున్నారు. అనంతరం సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: వేసవికి ముందే అడుగంటేశాయి

Intro:Tg_Mbnr_07_12_Impertens_Of_Vote_Avb_g3 రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు తో తనకు నచ్చిన వ్యక్తిని ప్రజా ప్రతినిధిగా చట్టసభల కు కు పంపించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే బాధ్యత పౌరులందరికీ సమానంగా ఉంది ఆ హక్కును వినియోగించడం లోనే లోపాలుండటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు గా మారింది. మార్పును కోరుకుంటున్న నవ సమాజం ఇకనైనా మేల్కొని దేశ భవిష్యత్తును నిర్ణయించే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సరైన వ్యక్తికి నిజాయితీగా ఓటు వేసి రానున్న భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు "సంకల్ప పత్రాల "ద్వారా ఉత్తరాలు రాసి హా మీ లు తీసుకున్నారు.


Body:ఎన్నికల సమయంలో లో పోలింగ్ శాతాన్ని పెంచడానికి అధికార యంత్రాంగం ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తూ కొన్నిచోట్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులకు బంధువులకు లేఖల రూపంలో వివరించడంతో పోలింగ్ శాతం పెరిగినట్లు గుర్తించారు. గమనించిన ఎన్నికల కమిషన్ అధికారులు అన్ని ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలలో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి చదివే విద్యార్థుల తో వారి తల్లిదండ్రులకు సంకల్ప పత్రం పేరుతో...... అమ్మ నాన్న నాకు కు వయోజన వయసు వచ్చేవరకు మన ప్రజాస్వామ్యాన్ని కాపాడండి . అందుకు నా కుటుంబం లోని అందరి ఓటర్లను అభ్యర్థిస్తున్నాను నా ఉజ్వలమైన భవిష్యత్తు కోసం తప్పనిసరిగా వినియోగించమని ప్రార్థిస్తున్నాను . ఓటు ద్వారా మీ ప్రేమను చూపించమని కోరుతున్నాను ఇది పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులకు నుంచి తీసుకున్న సంకల్ప పత్రము అన్ని పాఠశాలలో అమలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది సంఘం ఆదేశాల ప్రకారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నీ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సంకల్ప పత్రాలు రాయించి వారి తల్లిదండ్రులతో హామీ తీసుకుంటున్నారు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు వినూత్న కార్యక్రమాలు చేపట్టింది 2014 లో జరిగిన ఎన్నికల్లో 72.63 పోలింగ్ శాతం నమోదు కాగా 2018 నాటికి 81. 5 9 శాతానికి పెరగడం జిల్లా యంత్రాంగానికి మరింత ఉత్సాహాన్నిచ్చింది
రానున్న లోక్ సభ స్థానిక సంస్థల పురపాలక ఎన్నికలలో పోలింగ్ శాతాన్ని మరింత పెంచేందుకు నిర్ణయించారు ఓటు వినియోగం ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులు వారి తల్లిదండ్రులకు బంధువులకు లేఖల రూపంలో సంకల్ప పత్రం రూపంలో రాయడం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది
ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిజాయితీగా పూట వినియోగిస్తామని తల్లిదండ్రుల నుంచి విద్యార్థులు ఈ హామీ పత్రాన్ని తీసుకుంటున్నారు తల్లిదండ్రులతో సంతకంతో పాటు ఉ ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య చెర వారి నెంబర్లను నమోదు చేస్తారు . విద్యార్థులు చదువుతున్న పాఠశాల పేరు గ్రామము మండలము జిల్లా తదితర అంశాలను సేకరించి నమోదు చేస్తారు మరుసటి రోజు పాఠశాల యాజమాన్యానికి ఆ లేఖలను అందజేస్తా విద్యార్థులతో సేకరించిన లేఖలను పాఠశాల నిర్వాహకులు విద్యాశాఖ అధికారుల ద్వారా రాస్తా ఎన్నికల సంఘానికి చేరుతాయి
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 454 ప్రాథమికోన్నత పాఠశాలలు 570 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి వాటిలో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు సుమారు 3 లక్షల 20 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న గా మరో రెండు లక్షల మంది పైగా ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు వీరందరికీ రాష్ట్ర ఎన్నికల సంఘం పత్రాన్ని అందించి తల్లిదండ్రుల నుంచి సంతకాలు సేకరిస్తోంది
బైట్స్:
1. విద్యార్థి
2. విద్యార్థి
3. విద్యార్థి
4. విద్యార్థి
5. ప్రధానాచార్యులు రమేష్ దేవరకద్ర


Conclusion:ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన సంకల్ప పత్రాల కార్యక్రమం లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు
Last Updated : Mar 13, 2019, 8:33 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.