ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరుకు చెందిన బాలు చెరువులో మునిగి మృతి చెందాడు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని ఊరేగించారు. అనంతరం నిమజ్జనం చేసేందుకు సమీపంలో ఉన్న మధిర అంబర్పేట పెద్ద చెరువు వద్దకు తీసుకువచ్చారు. అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో బాలు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి: ఉద్యోగం పోయిందనే మనస్థాపంతో ఆర్టీసీ డ్రైవర్ మృతి!