ఖమ్మం జిల్లా వైరా పురపాలకలో అఖిలపక్షం, వర్తక సంఘాల ఆధ్వర్యంలో స్వచ్ఛంద లాక్డౌన్ ప్రకటించారు. పట్టణంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరగడం వల్ల... స్థానికంగా సమీక్ష ఏర్పాటు చేసిన ప్రజా ప్రతినిధులు, పార్టీల నాయకులు, వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు.
జులై 30 నుంచి ఆగస్టు 9 వరకు సంపూర్ణ బంద్ పాటించాలని తీర్మానం చేశారు. బుధవారం నుంచే వ్యాపార సంస్థలు మూసివేశారు.