భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం ఖమ్మం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈఆర్ఆర్ వేడుకల మందిరంలో కల్యాణ క్రతువు జరిగింది. శ్రీ త్రిదండి అహోబిల రామానుజీయర్ స్వామి, శ్రీ త్రిదండి దేవనాథ రామానుజీయర్ స్వామి సమక్షంలో కల్యాణం కన్నుల పండువలా జరిగింది. భద్రాచలం నుంచి ఉత్సవమూర్తులను తీసుకొచ్చి వేడుక నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఇదీ చూడండి: గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్