ETV Bharat / state

మౌలిక వసతులు కల్పించాలని ఖమ్మం జడ్పీ కూడలిలో ధర్నా - ఖమ్మం జిల్లా తాజా వార్తలు

ప్రభుత్వ ఇళ్ల కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్​ చేస్తూ ఖమ్మం జిల్లా శివాయిగూడెం వాసులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం స్పందించి సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

shivaigudem residents strike at khammam zp junction
మౌలిక వసతులు కల్పించాలని ఖమ్మం జడ్పీ కూడలిలో ధర్నా
author img

By

Published : Nov 30, 2020, 4:14 PM IST

కనీస వసతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ శివాయిగూడెం వాసులు ఖమ్మం జడ్పీ కూడలిలో ధర్నా చేపట్టారు. రఘునాథపాలెం మండలం శివాయిగూడెంలో పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది. కొంత మంది అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. అయితే వారు అక్కడ నివసించడానికి కనీస వసతుల కొరత ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మౌలిక వసతులైన తాగునీరు, కరెంటు, రోడ్లు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆందోళన చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

కనీస వసతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ శివాయిగూడెం వాసులు ఖమ్మం జడ్పీ కూడలిలో ధర్నా చేపట్టారు. రఘునాథపాలెం మండలం శివాయిగూడెంలో పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది. కొంత మంది అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. అయితే వారు అక్కడ నివసించడానికి కనీస వసతుల కొరత ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మౌలిక వసతులైన తాగునీరు, కరెంటు, రోడ్లు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆందోళన చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: కల్యాణలక్ష్మి పథకం అక్రమాల్లో వెలుగుచూస్తున్న కొత్తకోణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.