ETV Bharat / state

'రామాలయాన్ని బాగుచేయడం చేతకాని సీఎం.. దేశాన్ని బాగుచేస్తాననడం విడ్డూరం'

Ponguleti Srinivas Reddy Spiritual Meeting At Bhadrachalam: భద్రాద్రి రామాలయాన్ని బాగు చేయలేని సీఎం.. దేశాన్ని బాగు చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. భద్రాచలంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. సీఎం కేసీఆర్​పై తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపించారు.

author img

By

Published : Mar 25, 2023, 9:32 PM IST

pongulati srinivas reddy
pongulati srinivas reddy

Ponguleti Srinivas Reddy Spiritual Meeting At Bhadrachalam: రాముడే ముఖ్యమంత్రి చేతిలో తొలి బాధితుడనీ.. రాముల వారికి ముత్యాల తలంబ్రాలు ఇచ్చే తీరిక సీఎంకు లేదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. సీఎం కేసీఆర్​పై తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జడ్పీ ఛైర్మన్​ కోరం కనకయ్య, భారీగా కార్యకర్తలు హాజరయ్యారు.

భద్రాద్రి రామాలయాన్ని బాగు చేయలేని సీఎం దేశాన్ని బాగు చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. గోదావరి వరదలకు గురవుతున్న భద్రాచలం చుట్టు పక్కల ఉండే గ్రామాలను రక్షించడానికి రూ.1000 కోట్లతో కరకట్టను అభివృద్ధి చేస్తానని సీఎం మాట ఇచ్చిన దాదాపు 8 నెలలు అవుతుందన్నారు. అయినా ఇప్పటివరకు తట్టమట్టి కూడా వేయలేదని సీఎంపై ధ్వజమెత్తారు. నిర్మించి ఏళ్లు గడుస్తున్న భద్రాచలంలో డబుల్​ బెడ్​రూం ఇళ్లు ప్రారంభించే తీరిక ఈ ముఖ్యమంత్రికి లేదా అని ఎద్దేవా చేశారు. రాముడి తర్వాత ఈ సీఎం చేతిలో మోసపోయింది మాత్రం గిరిజనులే అని అన్నారు.

గ్రూప్​-1 రాసిన ప్రతి అభ్యర్థికి రూ. లక్ష ఇవ్వాలి: టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసులో విపక్షాలకు నోటీసులు పంపించారు.. తప్ప మంత్రులపై ఆరోపణలు వస్తున్నాయి వారికి ఎందుకు నోటీసులు పంపలేదని పొంగులేటి ప్రశ్నించారు. టీఎస్​పీఎస్సీ సభ్యులను వెంటనే బర్తరఫ్​ చేయాలని డిమాండ్​ చేశారు. గ్రూప్​-1 పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష పరిహారంగా ఇవ్వాలని డిమాండ్​ చేశారు. అసలు ఈ టీఎస్​పీఎస్సీ బోర్డునే రద్దు చేయాలని సూచించారు. ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా మారిన సిట్​తో.. విచారణ జరిపించకుండా విశ్రాంతి జడ్జి, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. 2018 ఎన్నికల్లో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని.. ఈరోజు వరకు ఎవరికీ నిరుద్యోగ భృతిని ఇవ్వలేదని గుర్తు చేశారు.

ఏ నిధులు వచ్చిన కల్వకుంట్ల కుటుంబానికి అందుతున్నాయి తప్ప సామాన్యుడికి అందే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదని ఆరోపించారు. ఏ పార్టీలో చేరుతానో చెప్పే సమయం దగ్గర పడింది.. తొందరలోనే తన నిర్ణయాన్ని వెల్లడిస్తానన్నారు. జెండా ఏదైనా అజెండా మాత్రం కేసీఆర్​ను గద్దె దించడమే అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

"రామాలయాన్నే అభివృద్ధి చేయలేని సీఎం.. ఇప్పుడు దేశాన్ని అభివృద్ధి చేస్తానంటే భద్రాచలం వాసులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. బంగారు తెలంగాణ గురించి కలలు కన్న మన కలల్ని కలలుగానే మిగిల్చిన ఈ సీఎం. ఆఖరికి రాముల వారికి చేసిన వాగ్దానాన్ని కూడాఈ సీఎం హత్య చేశారు." - పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, మాజీ ఎంపీ

రామాలయాన్ని బాగుచేయడం చేతకాని సీఎం.. దేశాన్ని బాగుచేస్తాననడం విడ్డూరం

ఇవీ చదవండి:

Ponguleti Srinivas Reddy Spiritual Meeting At Bhadrachalam: రాముడే ముఖ్యమంత్రి చేతిలో తొలి బాధితుడనీ.. రాముల వారికి ముత్యాల తలంబ్రాలు ఇచ్చే తీరిక సీఎంకు లేదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. సీఎం కేసీఆర్​పై తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జడ్పీ ఛైర్మన్​ కోరం కనకయ్య, భారీగా కార్యకర్తలు హాజరయ్యారు.

భద్రాద్రి రామాలయాన్ని బాగు చేయలేని సీఎం దేశాన్ని బాగు చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. గోదావరి వరదలకు గురవుతున్న భద్రాచలం చుట్టు పక్కల ఉండే గ్రామాలను రక్షించడానికి రూ.1000 కోట్లతో కరకట్టను అభివృద్ధి చేస్తానని సీఎం మాట ఇచ్చిన దాదాపు 8 నెలలు అవుతుందన్నారు. అయినా ఇప్పటివరకు తట్టమట్టి కూడా వేయలేదని సీఎంపై ధ్వజమెత్తారు. నిర్మించి ఏళ్లు గడుస్తున్న భద్రాచలంలో డబుల్​ బెడ్​రూం ఇళ్లు ప్రారంభించే తీరిక ఈ ముఖ్యమంత్రికి లేదా అని ఎద్దేవా చేశారు. రాముడి తర్వాత ఈ సీఎం చేతిలో మోసపోయింది మాత్రం గిరిజనులే అని అన్నారు.

గ్రూప్​-1 రాసిన ప్రతి అభ్యర్థికి రూ. లక్ష ఇవ్వాలి: టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసులో విపక్షాలకు నోటీసులు పంపించారు.. తప్ప మంత్రులపై ఆరోపణలు వస్తున్నాయి వారికి ఎందుకు నోటీసులు పంపలేదని పొంగులేటి ప్రశ్నించారు. టీఎస్​పీఎస్సీ సభ్యులను వెంటనే బర్తరఫ్​ చేయాలని డిమాండ్​ చేశారు. గ్రూప్​-1 పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష పరిహారంగా ఇవ్వాలని డిమాండ్​ చేశారు. అసలు ఈ టీఎస్​పీఎస్సీ బోర్డునే రద్దు చేయాలని సూచించారు. ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా మారిన సిట్​తో.. విచారణ జరిపించకుండా విశ్రాంతి జడ్జి, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. 2018 ఎన్నికల్లో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని.. ఈరోజు వరకు ఎవరికీ నిరుద్యోగ భృతిని ఇవ్వలేదని గుర్తు చేశారు.

ఏ నిధులు వచ్చిన కల్వకుంట్ల కుటుంబానికి అందుతున్నాయి తప్ప సామాన్యుడికి అందే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదని ఆరోపించారు. ఏ పార్టీలో చేరుతానో చెప్పే సమయం దగ్గర పడింది.. తొందరలోనే తన నిర్ణయాన్ని వెల్లడిస్తానన్నారు. జెండా ఏదైనా అజెండా మాత్రం కేసీఆర్​ను గద్దె దించడమే అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

"రామాలయాన్నే అభివృద్ధి చేయలేని సీఎం.. ఇప్పుడు దేశాన్ని అభివృద్ధి చేస్తానంటే భద్రాచలం వాసులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. బంగారు తెలంగాణ గురించి కలలు కన్న మన కలల్ని కలలుగానే మిగిల్చిన ఈ సీఎం. ఆఖరికి రాముల వారికి చేసిన వాగ్దానాన్ని కూడాఈ సీఎం హత్య చేశారు." - పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, మాజీ ఎంపీ

రామాలయాన్ని బాగుచేయడం చేతకాని సీఎం.. దేశాన్ని బాగుచేస్తాననడం విడ్డూరం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.