ETV Bharat / state

'కొండపోచమ్మ పనులతో నాకు సంబంధం లేదు' - ఖమ్మం జిల్లా వార్తలు

కొండ పోచమ్మ కాలువ పనులు నాసిరకంగా చేసినందునే.. కాలువకు గండి పడిందని తన మీద చేస్తున్న ప్రచారాలన్నీ అవాస్తవాలేనని.. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్​ రెడ్డి అన్నారు. కొండపోచమ్మ కాలువ పనులు చేసింది వేరే ఉపేందర్​ రెడ్డి అయితే.. ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, భట్టి విక్రమార్క తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.

MLA Upender Reddy Fires On Congress Leaders
కొండపోచమ్మ పనులతో నాకు సంబంధం లేదు : ఎమ్మెల్యే ఉపేందర్​ రెడ్డి
author img

By

Published : Jul 6, 2020, 3:15 PM IST

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఉపేందర్​ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కొండ పోచమ్మ కాలువ పనులు నాసిరకంగా చేసినందుకే కాలువకు గండి పడిందని కాంగ్రెస్​ నాయకులు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, భట్టి విక్రమా​ర్క తనపై ఆరోపణలు చేస్తున్నారని, అయితే తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్​ నుంచి టీఆర్​ఎస్​ పార్టీలోకి రావడం వల్ల తన మీద లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.

కొండ పోచమ్మ పనులు చేసింది నల్గొండ జిల్లాకు చెందిన ఉపేందర్​ రెడ్డి అని.. తనకు కొండపోచమ్మ కాలువ పనులతో సంబంధం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ పోచమ్మ పనులు తాను చేసినట్టు కాంగ్రెస్​ నాయకులు రుజువు చేస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. రైతుబంధు భవనం, ఆయుర్వేద ఆస్పత్రికి తన సొంతంగా రూ.10 లక్షలు ఇచ్చినట్టు ఉపేందర్​ రెడ్డి తెలిపారు. చేతనైతే ప్రజలకు మంచి చేయాలి కానీ.. అర్థం లేని ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు.

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఉపేందర్​ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కొండ పోచమ్మ కాలువ పనులు నాసిరకంగా చేసినందుకే కాలువకు గండి పడిందని కాంగ్రెస్​ నాయకులు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, భట్టి విక్రమా​ర్క తనపై ఆరోపణలు చేస్తున్నారని, అయితే తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్​ నుంచి టీఆర్​ఎస్​ పార్టీలోకి రావడం వల్ల తన మీద లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.

కొండ పోచమ్మ పనులు చేసింది నల్గొండ జిల్లాకు చెందిన ఉపేందర్​ రెడ్డి అని.. తనకు కొండపోచమ్మ కాలువ పనులతో సంబంధం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ పోచమ్మ పనులు తాను చేసినట్టు కాంగ్రెస్​ నాయకులు రుజువు చేస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. రైతుబంధు భవనం, ఆయుర్వేద ఆస్పత్రికి తన సొంతంగా రూ.10 లక్షలు ఇచ్చినట్టు ఉపేందర్​ రెడ్డి తెలిపారు. చేతనైతే ప్రజలకు మంచి చేయాలి కానీ.. అర్థం లేని ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు.

ఇదీ చదవండి: మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.