ETV Bharat / state

దశాబ్దాలుగా ఓటేసి గెలిపిస్తున్నా... ఒరిగిందేమి లేదు

ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికలప్పుడే మేం గుర్తుకువస్తాం. తమకు ఓటేయండి లేదు మా పార్టీకి ఓటేయండి అంటూ ప్రాధేయపడతారు. కష్టమనకా... ఇంటింటికి తిరుగుతారు... మమ్మల్ని ప్రసన్నం చేసుకుంటారు. ఒక్కసారి ఓటు వేశామంటే అంతే సంగతులు మళ్లీ... ఐదేళ్ల దాకా ఇటువైపే చూడరంటూ ఎన్నికలను బహిష్కరించారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలు.

author img

By

Published : Apr 12, 2019, 6:50 PM IST

ఎన్నికల బహిష్కరణ

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో ఉన్న వైరా నియోజకవర్గంలో ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి మండలాల్లో ఎన్నికలు బహిష్కరించారు. గిరిజనులు సాగు చేసుకునే పోడుభూములపై ఆంక్షలు విధించడం, తమకు రైతుబంధు, రైతుబీమా పథకాలు అందడం లేదని.. ఇతరత్రా సమస్యలను తీర్చలేదంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

సమస్యల తాండవం...

ఆయా మండలాల్లోని గ్రామాల్లో సమస్యలు తాండవం చేస్తున్నాయి. తాగు, సాగునీటికి అవస్థలు తప్పడం లేదు. మిషన్​ భగీరథ పనులు చాలా చోట్ల గుంతలకే పరిమితమయ్యాయి. తమ సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల ముందు చెప్పే నేతలు గెలిచిన తర్వాత ముఖం చాటేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. కొంతమంది సెల్​టవర్లు ఎక్కి నిరసన చేపట్టారు. సాధారణ రోజుల్లో రహదారులు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన తెలిపిన ప్రజలు ఎన్నికల రోజున ఆ సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఓటింగ్ బహిష్కరించారు.

పట్టించుకునే నాథుడేడి?

దశాబ్దాలుగా ఓట్లేసి గెలిపిస్తున్నా... అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారులు లేక, గుక్కెడు నీళ్లు రాక, పోడుభూములు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. జూలూరుపాడు మండలంలో సీతారామ కాలువ తవ్వకాలు, హెటెన్షన్‌ టవర్‌ల నిర్మాణం కోసం భూసేకరణకు పరిహారం తక్కువగా ఇస్తున్నారని అక్కడ నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఐదేళ్లకోసారి నేతలను ఎన్నుకోవడమే తప్ప తమకు ఒరిగిందేమీ లేదని ఆరోపిస్తూ.. ఎన్నికల్లో ఓటు వేయలేదు.

ఎన్నికల బహిష్కరణ

ఇవీ చూడండి: రివ్యూ: 'చిత్రలహరి' ఎలా ఉందంటే..!

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో ఉన్న వైరా నియోజకవర్గంలో ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి మండలాల్లో ఎన్నికలు బహిష్కరించారు. గిరిజనులు సాగు చేసుకునే పోడుభూములపై ఆంక్షలు విధించడం, తమకు రైతుబంధు, రైతుబీమా పథకాలు అందడం లేదని.. ఇతరత్రా సమస్యలను తీర్చలేదంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

సమస్యల తాండవం...

ఆయా మండలాల్లోని గ్రామాల్లో సమస్యలు తాండవం చేస్తున్నాయి. తాగు, సాగునీటికి అవస్థలు తప్పడం లేదు. మిషన్​ భగీరథ పనులు చాలా చోట్ల గుంతలకే పరిమితమయ్యాయి. తమ సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల ముందు చెప్పే నేతలు గెలిచిన తర్వాత ముఖం చాటేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. కొంతమంది సెల్​టవర్లు ఎక్కి నిరసన చేపట్టారు. సాధారణ రోజుల్లో రహదారులు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన తెలిపిన ప్రజలు ఎన్నికల రోజున ఆ సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఓటింగ్ బహిష్కరించారు.

పట్టించుకునే నాథుడేడి?

దశాబ్దాలుగా ఓట్లేసి గెలిపిస్తున్నా... అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారులు లేక, గుక్కెడు నీళ్లు రాక, పోడుభూములు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. జూలూరుపాడు మండలంలో సీతారామ కాలువ తవ్వకాలు, హెటెన్షన్‌ టవర్‌ల నిర్మాణం కోసం భూసేకరణకు పరిహారం తక్కువగా ఇస్తున్నారని అక్కడ నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఐదేళ్లకోసారి నేతలను ఎన్నుకోవడమే తప్ప తమకు ఒరిగిందేమీ లేదని ఆరోపిస్తూ.. ఎన్నికల్లో ఓటు వేయలేదు.

ఎన్నికల బహిష్కరణ

ఇవీ చూడండి: రివ్యూ: 'చిత్రలహరి' ఎలా ఉందంటే..!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.