ETV Bharat / state

వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మేకల తండాలో భారీ స్థాయిలో రేషన్ బియ్యం అక్రమ నిల్వలు లభ్యమయ్యాయి. అధికారులు స్వాధీనం చేసుకొని, ఛౌక ధరల దుకాణాన్ని సీజ్​ చేశారు.

author img

By

Published : Aug 5, 2020, 2:47 PM IST

వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మేకల తండాలో 100 క్వింటాల రేషన్​ బియ్యం పౌరసరఫరాల అధికారులు పట్టుకున్నారు. ఓ వ్యక్తి ఇంటి ప్రాంగణంలో అక్రమంగా నిల్వ ఉన్నట్టు వచ్చిన సమాచారం మేరకు అధికారులు దాడులు చేసి గుర్తించారు. రేషన్ దుకాణం తెరిచి లేనందున వివరాలు తెలియరాలేదు. తాత్కాలికంగా దుకాణాన్ని సీజ్​ చేశారు. భారీ స్థాయిలో అక్రమంగా నిల్వ ఉంచడంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పర్యవేక్షణ లోపించడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మేకల తండాలో 100 క్వింటాల రేషన్​ బియ్యం పౌరసరఫరాల అధికారులు పట్టుకున్నారు. ఓ వ్యక్తి ఇంటి ప్రాంగణంలో అక్రమంగా నిల్వ ఉన్నట్టు వచ్చిన సమాచారం మేరకు అధికారులు దాడులు చేసి గుర్తించారు. రేషన్ దుకాణం తెరిచి లేనందున వివరాలు తెలియరాలేదు. తాత్కాలికంగా దుకాణాన్ని సీజ్​ చేశారు. భారీ స్థాయిలో అక్రమంగా నిల్వ ఉంచడంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పర్యవేక్షణ లోపించడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.