నేరాల నియంత్రణలో భాగంగా ఖమ్మం జిల్లా వైరాలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. వైరా ఏసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సబ్ డివిజన్లోని పోలీసులు ఇందిరమ్మ కాలనీలో సోదాలు చేశారు. ఇంటింటికీ తిరిగి నివాసం ఉంటున్న వారి ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. అపరిచత వ్యక్తులకు ఇళ్లు అద్దెకు ఇవ్వరాదని, అలాంటి వ్యక్తులు కాలనీలో తిరిగినట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
వాహనాల ధ్రువీకరణ పత్రాలు ప్రతి ఒక్కరికి ఉండాలని, ఆధ్యాత్మిక కేంద్రాలు, రోజుల తరబడి యాత్రలు చేసే వారు పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లాలని తెలిపారు. ఒక్కసారిగా 60 మందికి పైగా పోలీసులు రావడంతో కాలనీ వాసులు ఉలిక్కిపడ్డారు. సీఐ వసంత్కుమార్, వివిధ పోలీస్స్టేషన్ల ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మధ్య మానేరు ప్రాజెక్టు సందర్శనకు కేసీఆర్