ఖమ్మం జిల్లాలో పలుచోట్ల దొంగతనాలకు పాల్పడుతున్న రాజమండ్రికి చెందిన దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. దొంగ నుంచి అరకిలో బంగారం, 3 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 16 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. జిల్లాలో దొంగతనాలను పూర్తిగా నివారించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు.
ఇవీ చూడండి:'ప్రణాళికలపై ప్రజాప్రతినిధులకు అవగాహన అవసరం'