సీఐటీయూ ఆద్వర్యంలో థియేటర్లో పనిచేసే కార్మికులు కరీంనగర్ పీఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తమకున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సినిమా థియేటర్ యాజమాన్యాలు దురుసుగా ప్రవర్తిస్తున్నారని... వేతనాలు సరిగ్గా ఇవ్వట్లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల నుంచి పీఎఫ్ కట్ చేసినా... అధికారులతో కుమ్మక్కై తమకు పీఎఫ్ రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఇదీ చదవండిః అమ్మ జ్ఞాపకాలతో... అనాథల ఆకలి తీరుస్తూ...