కరీంనగర్ జిల్లా రేకుర్తిలో సమ్మక్క-సారక్క జాతర ఘనంగా సాగుతోంది. భక్తులు అమ్మవార్లకు మెుక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులు స్నానమాచరించటానికి ప్రత్యేకంగా ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీటిని వదిలి కుళాయి ఏర్పాటు చేశారు. భద్రత పరంగా పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దొంగతనాలు జరిగేందుకు ఆస్కారం ఉన్నందున డాగ్ స్క్వాడ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అనుక్షణం గస్తీ కాస్తున్నారు.
ఇవీ చూడండి: 'ఐదుగురికి ఉరిశిక్ష వేయడం అభినందనీయం'