ETV Bharat / state

కరీంనగర్‌ రీజియన్‌లో తగ్గిన ఆర్టీసీ ఆదాయం

author img

By

Published : May 4, 2021, 4:36 AM IST

ప్రజారవాణాగా మన్ననలు పొందిన ఆర్టీసీకి కరోనా కోలుకోలేని దెబ్బతీస్తోంది. పల్లె నుంచి పట్టణం దాకా నిత్యం లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరవేసే ప్రజా రవాణా సంస్థ ప్రస్తుతం జనం కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. గతేడాది లాక్‌డౌన్‌తో డిపోలకే పరిమితమైన బస్సులు... రోడ్డెక్కి పూర్తిస్థాయి ఆదాయాన్ని సాధించే క్రమంలో.. కొవిడ్‌ రెండోదశ పిడుగులా వచ్చి పడింది. ఫలితంగా నైట్‌హాల్ట్‌ సర్వీసులు రద్దుతోపాటు ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది.

Karimnagar region Telangana, corona effect on tsrtc
కరీంనగర్‌ రీజియన్‌లో తగ్గిన ఆర్టీసీ ఆదాయం

రైలు సౌకర్యం అంతగా లేని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సులు ప్రయాణీకులతో కళకళలాడేవి. గతేడాది లాక్‌డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే కుదుట పడుతుండగా రెండోదశ కొవిడ్‌తో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. పాఠశాలలు కళాశాలల మూతతోపాటు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దన్న ఆంక్షలతో బస్టాండ్‌లు ప్రయాణీకుల్లేక నిర్మానుష్యంగా మారాయి.

జంకుతున్న జనం

కరీంనగర్‌ రీజియన్‌ 10 డిపోల పరిధిలో 805 బస్సులు 3లక్షల 70వేల కిలోమీటర్లు తిరిగితే... రోజూ కోటి 20 లక్షల కోట్ల ఆదాయం వచ్చేది. లాక్‌డౌన్‌తో గతేడాది మార్చి 22 నుంచి మే 18 వరకు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తిరిగి గాడిన పడుతున్న ఆర్టీసీ మరోసారి కొవిడ్‌ రూపంలో కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం ఆదాయం సగానికి సగం పడిపోయింది. మహమ్మారి వ్యాప్తితో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలంటే జనం జంకుతున్నారు. ఫలితంగా పగలు తిరిగే బస్సులను రద్దుచేయాల్సి వస్తోంది. 10 నుంచి 15 మందితోనే బస్సు నడపాల్సివస్తోందని సిబ్బంది చెబుతున్నారు.

తగ్గిన ఆదాయం

ప్రయాణ ప్రాంగణాలు, బస్సులను శానిటైజేషన్‌ చేస్తున్నప్పటికీ ప్రయాణీకుల రాక అంతంతమాత్రంగానే ఉంది. కరీంనగర్‌ రీజియన్‌ పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని అధికారులు తెలిపారు. ఆర్టీసీ పరిస్థితి మళ్లీ ఎప్పటికీ సాధారణ స్థితికి మారుతుందోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఇదీ చూడండి : తెరాస అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపించాయి: హరీశ్‌ రావు

రైలు సౌకర్యం అంతగా లేని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సులు ప్రయాణీకులతో కళకళలాడేవి. గతేడాది లాక్‌డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే కుదుట పడుతుండగా రెండోదశ కొవిడ్‌తో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. పాఠశాలలు కళాశాలల మూతతోపాటు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దన్న ఆంక్షలతో బస్టాండ్‌లు ప్రయాణీకుల్లేక నిర్మానుష్యంగా మారాయి.

జంకుతున్న జనం

కరీంనగర్‌ రీజియన్‌ 10 డిపోల పరిధిలో 805 బస్సులు 3లక్షల 70వేల కిలోమీటర్లు తిరిగితే... రోజూ కోటి 20 లక్షల కోట్ల ఆదాయం వచ్చేది. లాక్‌డౌన్‌తో గతేడాది మార్చి 22 నుంచి మే 18 వరకు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తిరిగి గాడిన పడుతున్న ఆర్టీసీ మరోసారి కొవిడ్‌ రూపంలో కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం ఆదాయం సగానికి సగం పడిపోయింది. మహమ్మారి వ్యాప్తితో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలంటే జనం జంకుతున్నారు. ఫలితంగా పగలు తిరిగే బస్సులను రద్దుచేయాల్సి వస్తోంది. 10 నుంచి 15 మందితోనే బస్సు నడపాల్సివస్తోందని సిబ్బంది చెబుతున్నారు.

తగ్గిన ఆదాయం

ప్రయాణ ప్రాంగణాలు, బస్సులను శానిటైజేషన్‌ చేస్తున్నప్పటికీ ప్రయాణీకుల రాక అంతంతమాత్రంగానే ఉంది. కరీంనగర్‌ రీజియన్‌ పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని అధికారులు తెలిపారు. ఆర్టీసీ పరిస్థితి మళ్లీ ఎప్పటికీ సాధారణ స్థితికి మారుతుందోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఇదీ చూడండి : తెరాస అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపించాయి: హరీశ్‌ రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.