ETV Bharat / state

వ్యాయామానికి ప్రజల ఓటు.. ఓపెన్​ జిమ్​ల ఏర్పాటు - open gyms by karimnagar corporation

కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్యం పట్ల స్పృహ పెరిగింది. వ్యాధినిరోధక శక్తి పెంచుకునేందుకు వ్యాయామాన్ని ఎంచుకుంటున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు మైదానాల బాట పడుతున్నారు. మరికొంత మంది జిమ్‌లకు వెళుతున్నారు. ప్రజల అవసరాలను గమనించి, నగర ప్రజలను ఫిట్​గా ఉంచేందుకు కరీంనగర్‌ నగరపాలక సంస్థ ప్రతి డివిజన్‌లో ఓపెన్‌ జిమ్​ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. టెండర్లను ఆహ్వానించి మొదటి విడతలో 30 జిమ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రక్రియ పూర్తి చేసింది.

open gyms at thirty divisions of karimnagar corporation
కరీంనగరంలో ఓపెన్​ జిమ్​ల ఏర్పాటు
author img

By

Published : Jan 5, 2021, 1:53 PM IST

ఆకర్షణీయ నగరాల జాబితాలో ఉన్న కరీంనగర్ నగరపాలక సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముమ్మరంగా నిధులను కేటాయిస్తోంది. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి నెల రూ.2.40 కోట్లు అందజేస్తున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించిన నగరపాలక సంస్థ వారి కోసం ఓపెన్ జిమ్​లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

వాక్​ ట్రాక్​లు

ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మైదానాల్లో ప్రత్యేకంగా కాలినడక కోసం ట్రాక్‌లు ఏర్పాటు చేయాలన్న వైద్యుల సూచన మేరకు ఆ దిశగా అడుగులు వేస్తోంది కరీంనగర్ నగరపాలిక. ప్రజలు నుంచి వచ్చిన సూచనల మేరకు నగరంలోని ప్రతి డివిజన్‌లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని ప్రణాళిక అమలు చేస్తోంది.

30 డివిజన్లలో ఓపెన్ జిమ్​లు

పట్టణ ప్రగతిలో అధిక శాతం నిధులు ప్రజలకు ఆహ్లాదం కలిగించే అంశాలకే కేటాయిస్తున్నట్లు మేయర్ సునీల్ రావు చెప్పారు. నగరంలో 60 డివిజన్లు ఉండగా తొలుత 30డివిజన్లలో ఓపెన్‌ జిమ్‌ల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశామని వెల్లడించారు. ఒక్కో ఓపెన్ జిమ్‌కు దాదాపు 12లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు వివరించారు.

ప్రత్యేక దృష్టి

ప్రజల ఆరోగ్యం కోసం నగరపాలిక ఏర్పాటు చేస్తున్న వ్యాయామశాలల నిర్వహణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని మేయర్ తెలిపారు. గతంలో ఏర్పాటు చేసిన జిమ్​లు సరైన నిర్వహణ లేక నిరుపయోగంగా ఉన్నందున ఈసారి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.

ఆకర్షణీయ నగరాల జాబితాలో ఉన్న కరీంనగర్ నగరపాలక సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముమ్మరంగా నిధులను కేటాయిస్తోంది. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి నెల రూ.2.40 కోట్లు అందజేస్తున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించిన నగరపాలక సంస్థ వారి కోసం ఓపెన్ జిమ్​లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

వాక్​ ట్రాక్​లు

ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మైదానాల్లో ప్రత్యేకంగా కాలినడక కోసం ట్రాక్‌లు ఏర్పాటు చేయాలన్న వైద్యుల సూచన మేరకు ఆ దిశగా అడుగులు వేస్తోంది కరీంనగర్ నగరపాలిక. ప్రజలు నుంచి వచ్చిన సూచనల మేరకు నగరంలోని ప్రతి డివిజన్‌లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని ప్రణాళిక అమలు చేస్తోంది.

30 డివిజన్లలో ఓపెన్ జిమ్​లు

పట్టణ ప్రగతిలో అధిక శాతం నిధులు ప్రజలకు ఆహ్లాదం కలిగించే అంశాలకే కేటాయిస్తున్నట్లు మేయర్ సునీల్ రావు చెప్పారు. నగరంలో 60 డివిజన్లు ఉండగా తొలుత 30డివిజన్లలో ఓపెన్‌ జిమ్‌ల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశామని వెల్లడించారు. ఒక్కో ఓపెన్ జిమ్‌కు దాదాపు 12లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు వివరించారు.

ప్రత్యేక దృష్టి

ప్రజల ఆరోగ్యం కోసం నగరపాలిక ఏర్పాటు చేస్తున్న వ్యాయామశాలల నిర్వహణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని మేయర్ తెలిపారు. గతంలో ఏర్పాటు చేసిన జిమ్​లు సరైన నిర్వహణ లేక నిరుపయోగంగా ఉన్నందున ఈసారి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.