ETV Bharat / state

డబ్బే ముఖ్యం.. భయం లేకుండా గుంపులుగా జనం - డబ్బే ముఖ్యం.. భయం లేకుండా గుంపులుగా జనం

కరీంనగర్​ జిల్లాలో పెరుగుతున్న కొవిడ్-19 కేసులతో అధికారులు భయాందోళనకు గురవుతుంటే ప్రజలకు మాత్రం అవేమీ పట్టనట్లు ఉంది. కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలోని యూనియన్​ బ్యాంకు వద్ద రైతులు భౌతిక దూరం మరచి రుణాల కోసం బారులు తీరారు.

no physical distance between people at karimnagar bank
డబ్బే ముఖ్యం.. భయం లేకుండా గుంపులుగా జనం
author img

By

Published : Jul 2, 2020, 1:46 PM IST

కరీంనగర్​ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలో యూనియన్​ బ్యాంకు ముందు రైతులు బారులు తీరారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కలవరపెడుతుంటే.. వారు మాత్రం అవేమీ పట్టనట్లు.. అసలు భౌతిక దూరమనే నియమాన్నే మరచి నిలబడ్డారు. పంట రుణాల కోసం బ్యాంకుకు చేరుకున్న అన్నదాతలు కనీసం మాస్కులు కూడా ధరించకుండా వచ్చారు.

ఈ పరిస్థితిని చూసిన కొందరు ఆందోళన పడుతున్నారు. తాము కొవిడ్ బారిన పడకుండా ఉండేందుకు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తుంటే వీరు మాత్రం అవేమీ పాటించట్లేదని భయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ కరోనా దరిచేరకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కరీంనగర్​ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలో యూనియన్​ బ్యాంకు ముందు రైతులు బారులు తీరారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కలవరపెడుతుంటే.. వారు మాత్రం అవేమీ పట్టనట్లు.. అసలు భౌతిక దూరమనే నియమాన్నే మరచి నిలబడ్డారు. పంట రుణాల కోసం బ్యాంకుకు చేరుకున్న అన్నదాతలు కనీసం మాస్కులు కూడా ధరించకుండా వచ్చారు.

ఈ పరిస్థితిని చూసిన కొందరు ఆందోళన పడుతున్నారు. తాము కొవిడ్ బారిన పడకుండా ఉండేందుకు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తుంటే వీరు మాత్రం అవేమీ పాటించట్లేదని భయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ కరోనా దరిచేరకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.