ETV Bharat / state

బీఆర్‌ఎస్‌ భరతం పట్టే రోజు దగ్గర్లోనే ఉంది: ఈటల రాజేందర్

etela rajender fires on cm kcr హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్... మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ పాదయత్ర ముగింపు సభ కరీంనగర్‌లో నిర్వహించారు. ఈ సభకు హాజరైన ఈటల.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరుపై విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్‌ భరతం పట్టే రోజు త్వరలోనే ఉందని వ్యాఖ్యానించారు.

author img

By

Published : Dec 15, 2022, 7:10 PM IST

etela rajender
etela rajender

etela rajender fires on cm kcr మార్పునకు నాంది కరీంనగర్‌.. డబ్బులకు ఎదురొడ్డిన జిల్లా కరీంనగర్‌.. అంటూ ప్రసంగం మొదలు పెట్టారు ఈటల రాజేందర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడుత ప్రజా సంగ్రామ పాదయత్ర ముగింపు సభ కరీంనగర్‌లో నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న ఈటల రాజేందర్... ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు. హుజూరాబాద్‌లో రూ.4వేల కోట్లు ఖర్చు చేసినా.. ప్రజలు కేసీఆర్‌ చెంపచెల్లుమనిపించారని అభిప్రాయపడ్డారు. 8 ఏళ్లలో రూ.లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే కేసీఆర్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కేంద్రం నిధులతోనే శ్మశాన వాటికలు సహా ఇతర నిర్మాణాలు జరిగాయి. తెలంగాణ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నోరు విప్పాలి. కేసీఆర్‌...పార్టీల మధ్య ఇనుప కంచెలుపెట్టి చిచ్చుపెట్టారు. ఎమ్మెల్యే, ఎంపీలు ఒకరికొకరు మాట్లాడుకునే పరిస్థితి లేకుండా చేశారు. ప్రజలు పోరాటం చేసి హెచ్చరిస్తే తప్పా అరాచకాలు ఆగవు. - ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యే

తెలంగాణ ప్రజలకు దిక్సూచిగా నిలిచిన జిల్లా కరీంనగర్‌ అని వ్యాఖ్యానించారు. భారాసకు భరతం పట్టే రోజు దగ్గర్లోనే ఉందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మొదలు పెట్టినప్పుడు శ్రీరామ రక్ష అని కేసీఆర్‌ అన్నారని గుర్తు చేశారు. గత 4 నెలలుగా అక్కడికి చీమను కూడా పోనివ్వడం లేదని మండిపడ్డారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద పోలీసులు తప్ప ఎవర్నీ పోనివ్వట్లేదని విరుచుకుపడ్డారు. రైతుల భూములను నిండా ముంచి నోట్లో మట్టి కొట్టిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు.

ఇవీ చూడండి:

etela rajender fires on cm kcr మార్పునకు నాంది కరీంనగర్‌.. డబ్బులకు ఎదురొడ్డిన జిల్లా కరీంనగర్‌.. అంటూ ప్రసంగం మొదలు పెట్టారు ఈటల రాజేందర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడుత ప్రజా సంగ్రామ పాదయత్ర ముగింపు సభ కరీంనగర్‌లో నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న ఈటల రాజేందర్... ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు. హుజూరాబాద్‌లో రూ.4వేల కోట్లు ఖర్చు చేసినా.. ప్రజలు కేసీఆర్‌ చెంపచెల్లుమనిపించారని అభిప్రాయపడ్డారు. 8 ఏళ్లలో రూ.లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే కేసీఆర్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కేంద్రం నిధులతోనే శ్మశాన వాటికలు సహా ఇతర నిర్మాణాలు జరిగాయి. తెలంగాణ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నోరు విప్పాలి. కేసీఆర్‌...పార్టీల మధ్య ఇనుప కంచెలుపెట్టి చిచ్చుపెట్టారు. ఎమ్మెల్యే, ఎంపీలు ఒకరికొకరు మాట్లాడుకునే పరిస్థితి లేకుండా చేశారు. ప్రజలు పోరాటం చేసి హెచ్చరిస్తే తప్పా అరాచకాలు ఆగవు. - ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యే

తెలంగాణ ప్రజలకు దిక్సూచిగా నిలిచిన జిల్లా కరీంనగర్‌ అని వ్యాఖ్యానించారు. భారాసకు భరతం పట్టే రోజు దగ్గర్లోనే ఉందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మొదలు పెట్టినప్పుడు శ్రీరామ రక్ష అని కేసీఆర్‌ అన్నారని గుర్తు చేశారు. గత 4 నెలలుగా అక్కడికి చీమను కూడా పోనివ్వడం లేదని మండిపడ్డారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద పోలీసులు తప్ప ఎవర్నీ పోనివ్వట్లేదని విరుచుకుపడ్డారు. రైతుల భూములను నిండా ముంచి నోట్లో మట్టి కొట్టిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.