కరీంనగర్ కారు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పరామర్శించారు. విధుల్లో ఉండి మృతి చెందిన పోలీస్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన అన్నారు.
మానేరు వంతెనపై జరిగిన ప్రమాదంపై విచారణ చేపడతామని... తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
- సంబంధిత కథనం: వంతెన పైనుంచి కారు పల్టీ..ఒకరు మృతి