ETV Bharat / state

'రైతు విలువను మరిచిపోయి చట్టాలు చేయడం సరికాదు'

author img

By

Published : Feb 18, 2021, 7:50 PM IST

కేంద్రం రైతు విలువను మరిచిపోయి చట్టాలను చేయడం సరికాదని మంత్రి ఈటల రాజేందర్​ విమర్శించారు. కరీంనగర్​ జిల్లా దుద్దెనపల్లి, రాయికల్​ గ్రామాల్లో రైతు వేదికలను మంత్రి ప్రారంభించారు. ఏ ప్రభుత్వాలైనా, పార్టీలైనా ప్రజలను ఇబ్బంది పెట్టే ఆలోచనలు చేయొద్దని కోరారు.

'రైతు విలువను మరిచిపోయి చట్టాలు చేయడం సరికాదు'
'రైతు విలువను మరిచిపోయి చట్టాలు చేయడం సరికాదు'

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి, రాయికల్ గ్రామాల్లో రైతు వేదికలను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే సతీష్ కుమార్​తో కలిసి ప్రారంభించారు. త్వరలోనే గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేసి వచ్చే వర్షాకాలం వరకు ఈ ప్రాంతానికి సాగు నీరు అందించి సస్యశ్యామలం చేస్తామన్నారు. మానవులకే కాకుండా ప్రకృతిలో ఉండే సమస్థ జీవకోటికి అన్నం పెట్టేది రైతన్ననే అని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం రైతు విలువను మరిచిపోయి చట్టాలు చేయడం సరికాదన్నారు.

సాఫ్ట్​వేర్​ కంపెనీలు, పరిశ్రమలు ఎంత మందికి ఉపాధి కల్పిస్తాయని, ఇవాళ నూటికి 90 కోట్ల మందికి అన్నం పెట్టేది, ఉపాధి కల్పించేది పల్లెలు, వ్యవసాయమేనన్నారు. రైతును మర్చిపోయి చట్టాలు చేస్తే మనకు మనమే కళ్లలో మట్టి కొట్టుకున్న వాళ్లమవుతామని పరోక్షంగా విమర్శించారు. ఏ ప్రభుత్వాలైనా, ఏ పార్టీలైనా ప్రజల మేలు కోసం, బాగు కోసం ఆలోచించాలి కానీ... ప్రజలను ఇబ్బంది పెట్టే ఆలోచనలు చేయొద్దని కోరారు.

'రైతు విలువను మరిచిపోయి చట్టాలు చేయడం సరికాదు'

ఇదీ చదవండి: ఇండియా సైకిల్ ఫర్ ఛేంజ్ ఛాలెంజ్​లో రాష్ట్రం నుంచి 2 నగరాలు

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి, రాయికల్ గ్రామాల్లో రైతు వేదికలను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే సతీష్ కుమార్​తో కలిసి ప్రారంభించారు. త్వరలోనే గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేసి వచ్చే వర్షాకాలం వరకు ఈ ప్రాంతానికి సాగు నీరు అందించి సస్యశ్యామలం చేస్తామన్నారు. మానవులకే కాకుండా ప్రకృతిలో ఉండే సమస్థ జీవకోటికి అన్నం పెట్టేది రైతన్ననే అని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం రైతు విలువను మరిచిపోయి చట్టాలు చేయడం సరికాదన్నారు.

సాఫ్ట్​వేర్​ కంపెనీలు, పరిశ్రమలు ఎంత మందికి ఉపాధి కల్పిస్తాయని, ఇవాళ నూటికి 90 కోట్ల మందికి అన్నం పెట్టేది, ఉపాధి కల్పించేది పల్లెలు, వ్యవసాయమేనన్నారు. రైతును మర్చిపోయి చట్టాలు చేస్తే మనకు మనమే కళ్లలో మట్టి కొట్టుకున్న వాళ్లమవుతామని పరోక్షంగా విమర్శించారు. ఏ ప్రభుత్వాలైనా, ఏ పార్టీలైనా ప్రజల మేలు కోసం, బాగు కోసం ఆలోచించాలి కానీ... ప్రజలను ఇబ్బంది పెట్టే ఆలోచనలు చేయొద్దని కోరారు.

'రైతు విలువను మరిచిపోయి చట్టాలు చేయడం సరికాదు'

ఇదీ చదవండి: ఇండియా సైకిల్ ఫర్ ఛేంజ్ ఛాలెంజ్​లో రాష్ట్రం నుంచి 2 నగరాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.