దిశాలాంటి ఘటనల్లో ఉరిశిక్షలు, ఎన్కౌంటర్లు తాత్కాలిక ఉపశమనాలే కానీ... శాశ్వత పరిష్కారం కాదని మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. సమాజంతో మార్పు రావాలని అప్పుడే ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కావద్దని ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో మానవ వికాస వేదిక రాష్ట్రస్థాయి 3వ వార్షిక మహాసభకు మంత్రి హాజరయ్యారు.
విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహా, ఆలోచనల ఘర్షణలు లేకపోవటం వల్ల మనుషులు మృగాలుగా మారుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మానవ జీవితాన్ని సుసంపన్నం చేయటం కోసం వచ్చిన టెక్నాలజీ... ఇప్పుడు సమాజ వినాశనానికి అడుగులు వేసేలా చేస్తున్నాయని వివరించారు.
ఇదీ చూడండి: అయేషా గోళ్లు, ఎముకలు, కేశాల పరిశీలన