ETV Bharat / state

'సుందర నగరంగా కరీంనగర్​ని తీర్చిదిద్దాతాం'

author img

By

Published : May 20, 2021, 7:22 PM IST

కరీంనగర్ నగరంలోని 47వ డివిజన్​లో 56 లక్షలతో చేపట్టబోయే మురికి కాలువలు, సీసీ రహదారుల నిర్మాణానికి నగర మేయర్​ సునీల్​రావు... కార్పొరేటర్​తో కలిసి భూమి పూజ చేశారు. సుందర నగరంగా కరీంనగర్​ని తీర్చిదిద్దాతామన్నారు.

karimnagar mayor sunil rao
karimnagar mayor sunil rao

కరీంనగర్ నగరాన్ని సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతామని నగరపాలక సంస్థ మేయర్ సునీల్​రావు పేర్కొన్నారు. నగరంలోని 47వ డివిజన్​లో 56 లక్షలతో చేపట్టబోయే మురికి కాలువలు, సీసీ రహదారులు నిర్మాణానికి ఆయన కార్పొరేటర్​తో కలిసి భూమి పూజ చేశారు.

కరీంనగర్​ నగరం ఏర్పడి మొదటి ఇంటి నంబర్ వీధిలో పనులు చేపట్టడం సంతోషంగా ఉందని వెల్లడించారు. 50 సంవత్సరాల క్రితం వేసిన రహదారులు, మురికి కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయని... ప్రజలు ఇబ్బందులు పడకుండా నగరపాలక సంస్థ చూస్తుందని చెప్పారు. నగరంలో కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా.. ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. లాక్​డౌన్ సమయంలో ప్రజలు బయటకు రావొద్దని సూచించారు.

ఇవీ చూడండి: పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ కొత్త పోర్టల్

కరీంనగర్ నగరాన్ని సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతామని నగరపాలక సంస్థ మేయర్ సునీల్​రావు పేర్కొన్నారు. నగరంలోని 47వ డివిజన్​లో 56 లక్షలతో చేపట్టబోయే మురికి కాలువలు, సీసీ రహదారులు నిర్మాణానికి ఆయన కార్పొరేటర్​తో కలిసి భూమి పూజ చేశారు.

కరీంనగర్​ నగరం ఏర్పడి మొదటి ఇంటి నంబర్ వీధిలో పనులు చేపట్టడం సంతోషంగా ఉందని వెల్లడించారు. 50 సంవత్సరాల క్రితం వేసిన రహదారులు, మురికి కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయని... ప్రజలు ఇబ్బందులు పడకుండా నగరపాలక సంస్థ చూస్తుందని చెప్పారు. నగరంలో కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా.. ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. లాక్​డౌన్ సమయంలో ప్రజలు బయటకు రావొద్దని సూచించారు.

ఇవీ చూడండి: పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ కొత్త పోర్టల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.