ETV Bharat / state

ప్రజల తీర్పును విపక్షాలు అపహాస్యం చేస్తున్నాయి: సునీల్​రావు - కరీంనగర్ మున్సిపాలిటీ వార్తలు

రాష్ట్రాభివృద్ధే తెరాస ప్రధాన లక్ష్యమని కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్​ సునీల్​రావు తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అధికారం కోసం భాజపా, కాంగ్రెస్​ నేతలు ఆరాటపడుతున్నారని విమర్శించారు.

karimnagar mayor allegation on bjp and congress partys  are mocking the judgment of the people
ప్రజల తీర్పును విపక్షాలు అపహాస్యం చేస్తున్నాయి: సునీల్​రావు
author img

By

Published : Feb 14, 2021, 8:16 PM IST

కాంగ్రెస్, భాజపాలు ప్రజల తీర్పును అపహాస్యం చేస్తున్నాయని కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ సునీల్​రావు విమర్శించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన ఇరు పార్టీల నేతలు తాము అధికారంలోకి వచ్చినట్లు పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో అధికారం కోసం భాజపా, కాంగ్రెస్​ నేతలు ఆరాటపడుతున్నారని సునీల్​రావు మండిపడ్డారు. విపక్షనేతలు దిగజారి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. భాషతీరు మార్చుకోకపోతే వారి కన్నా ఎక్కువగా విమర్శించే శక్తి తెరాసకు ఉందని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగు నీరు, 24 గంటల విద్యుత్​ ఇస్తున్నందుకు తమని విమర్శిస్తున్నారా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్, భాజపాలు ప్రజల తీర్పును అపహాస్యం చేస్తున్నాయని కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ సునీల్​రావు విమర్శించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన ఇరు పార్టీల నేతలు తాము అధికారంలోకి వచ్చినట్లు పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో అధికారం కోసం భాజపా, కాంగ్రెస్​ నేతలు ఆరాటపడుతున్నారని సునీల్​రావు మండిపడ్డారు. విపక్షనేతలు దిగజారి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. భాషతీరు మార్చుకోకపోతే వారి కన్నా ఎక్కువగా విమర్శించే శక్తి తెరాసకు ఉందని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగు నీరు, 24 గంటల విద్యుత్​ ఇస్తున్నందుకు తమని విమర్శిస్తున్నారా అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: ప్రేమి'కుల' పెళ్లి సమస్యకు నింగప్ప పరిష్కారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.