ETV Bharat / state

కలెక్టర్​ ఆకస్మిక పర్యటన... ఎల్​ఆర్​ఎస్​ సర్వేపై ఆరా

కరీంనగర్​ జిల్లా సైదాపూర్​ మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్​ శశాంక పర్యటించారు. రైతు వేదిక భవనాల పురోగతిని పరిశిలించారు. గ్రామాల్లో అధికారులు చేపట్టిన ఎల్​ఆర్​ఎస్​ సర్వేపై ఆరా తీశారు. ప్రజలు ఎలా సహకరిస్తున్నారు.. అధికారులు ఎలాంటి సమాచారం తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు.

author img

By

Published : Oct 7, 2020, 5:43 PM IST

karimnagar collector shashanka sudden visit in villages
karimnagar collector shashanka sudden visit in villages

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆకునూరు, దుద్దెనపల్లి, గొడిశాల గ్రామాల్లో కలెక్టర్ శశాంక ఆకస్మికంగా పర్యటించారు. రైతు వేదిక భవనాల పనుల పురోగతిని పరిశీలించారు. త్వరితగతిన నిర్మాణాలను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ సర్వేను అధికారులు ఏ విధంగా చేపడుతున్నారో స్వయంగా పలు ఇళ్లకు వెళ్లి పరిశీలించారు. సర్వేకు ప్రజల సహకారం ఎలా ఉందని, ఏఏ విషయాలను వారి నుంచి తెలుసుకుంటున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ప్రజల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ఏ ఏ గ్రామాలు, వార్డులకు వెళ్తున్నారో ఆ స్థానికులకు ఒకరోజు ముందుగా సమాచారం అందివ్వాలని తెలిపారు. కలెక్టర్ వెంట రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు సారబూడ్ల ప్రభాకర్ రెడ్డి, ఎంపీడీఓ పద్మావతి, ఎమ్మార్వో సదానందం, పంచాయతీరాజ్ ఏఈ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

ఇదీ చూడండి: ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ, భద్రతకు సర్కారు ప్రాధాన్యం ఇస్తోంది: కేటీఆర్‌

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆకునూరు, దుద్దెనపల్లి, గొడిశాల గ్రామాల్లో కలెక్టర్ శశాంక ఆకస్మికంగా పర్యటించారు. రైతు వేదిక భవనాల పనుల పురోగతిని పరిశీలించారు. త్వరితగతిన నిర్మాణాలను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ సర్వేను అధికారులు ఏ విధంగా చేపడుతున్నారో స్వయంగా పలు ఇళ్లకు వెళ్లి పరిశీలించారు. సర్వేకు ప్రజల సహకారం ఎలా ఉందని, ఏఏ విషయాలను వారి నుంచి తెలుసుకుంటున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ప్రజల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ఏ ఏ గ్రామాలు, వార్డులకు వెళ్తున్నారో ఆ స్థానికులకు ఒకరోజు ముందుగా సమాచారం అందివ్వాలని తెలిపారు. కలెక్టర్ వెంట రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు సారబూడ్ల ప్రభాకర్ రెడ్డి, ఎంపీడీఓ పద్మావతి, ఎమ్మార్వో సదానందం, పంచాయతీరాజ్ ఏఈ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

ఇదీ చూడండి: ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ, భద్రతకు సర్కారు ప్రాధాన్యం ఇస్తోంది: కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.