ETV Bharat / state

HARISH RAO: 'అన్నం పెట్టే వాళ్లెవరూ.. నష్టం చేసేవాళ్లెవరో ఆలోచించండి'

author img

By

Published : Oct 17, 2021, 11:29 PM IST

ఈటల రాజేందర్​ను (huzurabad by poll campaign news) కేసీఆరే పెంచి పెద్ద చేస్తే.. ఆయన మాత్రం.. కేసీఆర్​కు ఘోరీ కడతా అంటున్నారని హరీశ్​రావు తెలిపారు. కరీంనగర్​ జిల్లా వీణవంకలో నిర్వహించిన ధూంధాం కార్యక్రమంలో పాల్గొన్న ఈటల. ఏ పార్టీకి ఓటు వేస్తే హుజూరాబాద్​ అభివృద్ధి చెందుతుంతో ప్రజలు ఆలోచించాలని కోరారు.

HARISH RAO
HARISH RAO

హుజూరాబాద్​ ప్రస్తుతం (huzurabad bypoll campaign news)జరుగుతున్న ఉపఎన్నికలో ఏ పార్టీకి ఓటు వేస్తే మనకు లాభమో ఆలోచించాలని కరీంనగర్​ జిల్లా వీణవంక ప్రజలకు మంత్రి హరీశ్​రావు సూచించారు. మనకు అన్నం పెట్టిన వాళ్లు ఎవరో.. నష్టం చేసే వాళ్లెవరో ఆలోచించి ఓటు హక్కును వినియోగించాలని కోరారు. వీణవంకలో జరిగిన ధూంధాంలో కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

కొందరు సెంటిమెంట్ మాటలతో ఓట్లు పొందాలని చూస్తున్నారని చెప్పిన హరీశ్​.. పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రజలను కోరారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో​ తెరాస, భాజపాలు రెండు మాత్రమే పోటీలో ఉన్నాయన్నారు. ముద్దసాని దామోదర్​రెడ్డి మీద పోటీకి 2004లో ఈటల రాజేందర్​కు టికెట్ ఇచ్చినప్పుడు... గులాబీ కండువా, కారు గుర్తును చూసిమాత్రమే ఓటు వేసి గెలిపించారని హరీశ్​ అన్నారు. కానీ ఈటల రాజేందర్​ మాత్రం తనను చూసే ప్రజలు ఓట్లేసినట్లు చెబుతున్నారని హరీశ్​ మండిపడ్డారు.

ఈటల రాజేందర్​ను.. కేసీఆర్​ పెంచి పెద్ద చేస్తే.. ఈటల మాత్రం కేసీఆర్​కు ఘోరీ కడతా అంటున్నారని.. ఇది న్యాయమేనే.. ఇలా మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు.. హరీశ్​రావు.

HARISH RAO: 'హుజూరాబాద్​లో అన్నం పెట్టే వాళ్లెవరూ.. నష్టం చేసేవాళ్లెవరో ఆలోచించండి'

'కేసీఆర్...ఈటలను సొంత సోదరుడిలా ​చూసుకున్నారు. పెంచి పెద్ద చేశారు. కానీ ఈటల మాత్రం కేసీఆర్​కు ఘోరీ కడతా అంటున్నారు. హుజూరాబాద్​లో ఎవరికి ఓటు వేస్తే లాభమో ప్రజలు ఆలోచించాలి. మనకు అన్నం పెట్టిన వాళ్లు ఎవరో.. నష్టం చేసే వాళ్లెవరో గుర్తించాలి.'

- హరీశ్​రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి

ఇదీచూడండి: CM KCR: ఈనెల 25 తర్వాత హుజూరాబాద్‌లో కేసీఆర్‌ సభ

హుజూరాబాద్​ ప్రస్తుతం (huzurabad bypoll campaign news)జరుగుతున్న ఉపఎన్నికలో ఏ పార్టీకి ఓటు వేస్తే మనకు లాభమో ఆలోచించాలని కరీంనగర్​ జిల్లా వీణవంక ప్రజలకు మంత్రి హరీశ్​రావు సూచించారు. మనకు అన్నం పెట్టిన వాళ్లు ఎవరో.. నష్టం చేసే వాళ్లెవరో ఆలోచించి ఓటు హక్కును వినియోగించాలని కోరారు. వీణవంకలో జరిగిన ధూంధాంలో కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

కొందరు సెంటిమెంట్ మాటలతో ఓట్లు పొందాలని చూస్తున్నారని చెప్పిన హరీశ్​.. పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రజలను కోరారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో​ తెరాస, భాజపాలు రెండు మాత్రమే పోటీలో ఉన్నాయన్నారు. ముద్దసాని దామోదర్​రెడ్డి మీద పోటీకి 2004లో ఈటల రాజేందర్​కు టికెట్ ఇచ్చినప్పుడు... గులాబీ కండువా, కారు గుర్తును చూసిమాత్రమే ఓటు వేసి గెలిపించారని హరీశ్​ అన్నారు. కానీ ఈటల రాజేందర్​ మాత్రం తనను చూసే ప్రజలు ఓట్లేసినట్లు చెబుతున్నారని హరీశ్​ మండిపడ్డారు.

ఈటల రాజేందర్​ను.. కేసీఆర్​ పెంచి పెద్ద చేస్తే.. ఈటల మాత్రం కేసీఆర్​కు ఘోరీ కడతా అంటున్నారని.. ఇది న్యాయమేనే.. ఇలా మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు.. హరీశ్​రావు.

HARISH RAO: 'హుజూరాబాద్​లో అన్నం పెట్టే వాళ్లెవరూ.. నష్టం చేసేవాళ్లెవరో ఆలోచించండి'

'కేసీఆర్...ఈటలను సొంత సోదరుడిలా ​చూసుకున్నారు. పెంచి పెద్ద చేశారు. కానీ ఈటల మాత్రం కేసీఆర్​కు ఘోరీ కడతా అంటున్నారు. హుజూరాబాద్​లో ఎవరికి ఓటు వేస్తే లాభమో ప్రజలు ఆలోచించాలి. మనకు అన్నం పెట్టిన వాళ్లు ఎవరో.. నష్టం చేసే వాళ్లెవరో గుర్తించాలి.'

- హరీశ్​రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి

ఇదీచూడండి: CM KCR: ఈనెల 25 తర్వాత హుజూరాబాద్‌లో కేసీఆర్‌ సభ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.