ETV Bharat / state

నిండు కుండలా లోయర్​ మానేరు డ్యామ్​

author img

By

Published : Mar 4, 2021, 9:04 AM IST

కరీంనగర్‌ దిగువ మానేరు జలాశయంలో రికార్డుల పరంపర కొనసాగుతోంది. మొయతుమ్మెద వాగు ప్రవాహంతోపాటు ఎస్ఆర్​ఎస్పీ నీటిపై ఆధారపడ్డ జలాశయం... ఈ ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు జలఫలాలతో నిండుకుండలా మారింది. ఎప్పుడు వేసవి వచ్చినా తాగునీటి నిల్వల కోసమే కటకటలాడే పరిస్థితి ఉండగా ఈ సారి వరదగేట్ల నుంచి జలపరవళ్లు కొనసాగుతున్నాయి.

full of water in lower maneru dam in karimnagar district
నిండు కుండలా లోయర్​ మానేరు డ్యామ్​
నిండు కుండలా లోయర్​ మానేరు డ్యామ్​

బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా నిర్మించిన దిగువ మానేరు జలాశయం ప్రస్తుతం పూర్తిగా మారిపోయింది. గతంలో మార్చి వచ్చేసరికి డెడ్‌స్టోరేజి కారణంగా ప్రతి చుక్కను జాగ్రత్తగా వాడుకోవాలని అధికారులు సూచించేవారు. సాగునీటిని పక్కనపెట్టి కేవలం కరీంనగర్, సిద్దిపేటకు తాగునీటి కోసం నీటి నిల్వ ఉండేలా చర్యలు తీసుకునేవారు. ఎండకాలంలో కరీంనగర్‌ వాసులకు నీరు అందక బూస్టర్ల ద్వారా నీటిని తోడేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. డెడ్‌ స్టోరేజి కాదు కదా... ఈసారి వరద గేట్ల ద్వారానే సుమారు 80 టీఎంసీల నీటిని మానేరు వాగులోకి వదిలిపెట్టగా... ఇప్పటికే కాకతీయ కాల్వ ద్వారా 44 టీఎంసీల నీటిని ఆయకట్టు రైతులకు తరలించారు. మరో 23 టీఎంసీల నీటిని మొత్తం 346కిలోమీటర్ల వరకు సాగునీటిని చేరవేసే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఫలితంగా ఎండకాలంలోనూ సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

రోజు 3,150 క్యూసెక్కులు రాక

దిగువమానేరు జలాశయం పరధిలో సుమారు 8.94లక్షల ఆయకట్టు ఉండగా.. ఏటా నీటి కొరత కారణంగా వారబందీ పద్ధతిన నీటిని విడుదల చేసేవారు. వారం రోజుల పాటు నీటిని విడుదల చేసి మరోవారం పాటు నీటిని నిలిపివేయడంతో చివరి ఆయకట్టు వరకు నీరు అందేది కాదు. ఇప్పుడు గాయత్రీ పంపుహౌస్‌ నుంచి మధ్యమానేరుకు... అక్కడి నుంచి రోజు 3,150 క్యూసెక్కుల నీరు దిగువమానేరు జలాశయానికి వచ్చి చేరుతోంది. దీంతో వారబందీ పద్ధతిలో కాకుండా ఏకధాటిగా డిసెంబర్‌ 15 నుంచి 5 వేల క్యూసెక్కులు నీటికి కిందికి వదులుతున్నారు.

మోయతుమ్మెద వాగు నుంచి 83 టీఎంసీలు

గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మోయతుమ్మెద వాగు నుంచి 83 టీఎంసీల నీరు దిగువమానేరు జలాశయంలోకి రాగా.. 55 టీఎంసీలు మధ్యమానేరు నుంచి వచ్చి చేరింది. జలాశయంలో పుష్కలంగా నీరుండటంతో కేటాయించిన 67టీఎంసీల నీటి నుంచి 44టీఎంసీల నీటిని కిందికి తరలిస్తున్నారు.

ఇదీ చదవండి: జోరుగా వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు

నిండు కుండలా లోయర్​ మానేరు డ్యామ్​

బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా నిర్మించిన దిగువ మానేరు జలాశయం ప్రస్తుతం పూర్తిగా మారిపోయింది. గతంలో మార్చి వచ్చేసరికి డెడ్‌స్టోరేజి కారణంగా ప్రతి చుక్కను జాగ్రత్తగా వాడుకోవాలని అధికారులు సూచించేవారు. సాగునీటిని పక్కనపెట్టి కేవలం కరీంనగర్, సిద్దిపేటకు తాగునీటి కోసం నీటి నిల్వ ఉండేలా చర్యలు తీసుకునేవారు. ఎండకాలంలో కరీంనగర్‌ వాసులకు నీరు అందక బూస్టర్ల ద్వారా నీటిని తోడేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. డెడ్‌ స్టోరేజి కాదు కదా... ఈసారి వరద గేట్ల ద్వారానే సుమారు 80 టీఎంసీల నీటిని మానేరు వాగులోకి వదిలిపెట్టగా... ఇప్పటికే కాకతీయ కాల్వ ద్వారా 44 టీఎంసీల నీటిని ఆయకట్టు రైతులకు తరలించారు. మరో 23 టీఎంసీల నీటిని మొత్తం 346కిలోమీటర్ల వరకు సాగునీటిని చేరవేసే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఫలితంగా ఎండకాలంలోనూ సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

రోజు 3,150 క్యూసెక్కులు రాక

దిగువమానేరు జలాశయం పరధిలో సుమారు 8.94లక్షల ఆయకట్టు ఉండగా.. ఏటా నీటి కొరత కారణంగా వారబందీ పద్ధతిన నీటిని విడుదల చేసేవారు. వారం రోజుల పాటు నీటిని విడుదల చేసి మరోవారం పాటు నీటిని నిలిపివేయడంతో చివరి ఆయకట్టు వరకు నీరు అందేది కాదు. ఇప్పుడు గాయత్రీ పంపుహౌస్‌ నుంచి మధ్యమానేరుకు... అక్కడి నుంచి రోజు 3,150 క్యూసెక్కుల నీరు దిగువమానేరు జలాశయానికి వచ్చి చేరుతోంది. దీంతో వారబందీ పద్ధతిలో కాకుండా ఏకధాటిగా డిసెంబర్‌ 15 నుంచి 5 వేల క్యూసెక్కులు నీటికి కిందికి వదులుతున్నారు.

మోయతుమ్మెద వాగు నుంచి 83 టీఎంసీలు

గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మోయతుమ్మెద వాగు నుంచి 83 టీఎంసీల నీరు దిగువమానేరు జలాశయంలోకి రాగా.. 55 టీఎంసీలు మధ్యమానేరు నుంచి వచ్చి చేరింది. జలాశయంలో పుష్కలంగా నీరుండటంతో కేటాయించిన 67టీఎంసీల నీటి నుంచి 44టీఎంసీల నీటిని కిందికి తరలిస్తున్నారు.

ఇదీ చదవండి: జోరుగా వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.