ETV Bharat / state

CM KCR Public Meeting: 16న సీఎం సభ... సీఎస్ సోమేశ్ కుమార్​ సమీక్ష

author img

By

Published : Aug 14, 2021, 10:22 AM IST

Updated : Aug 14, 2021, 2:27 PM IST

శాలపల్లిలో సీఎం కేసీఆర్​ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం బహిరంగ సభ ఏర్పాట్లపై సీఎస్​ సోమేశ్​ కుమార్​ కరీంనగర్ కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

somesh
సోమేశ్ కుమార్

ఈ నెల 16న కరీంనగర్​ జిల్లా శాలపల్లి ఇందిరానగర్‌లో సీఎం కేసీఆర్ సభ నిర్వహించనున్నారు. ఇందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలోనే కేసీఆర్​.. దళిత బంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం బహిరంగ సభ ఏర్పాట్లపై సీఎస్​ సోమేశ్​ కుమార్​ కరీంనగర్ కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్​, ఇతర అధికారులు పాల్గొన్నారు. గ్రామసభల ద్వారా గ్రామాల్లో దళిత బంధు సాయం పంపిణీ సీఎస్ సోమేశ్​ కుమార్​ తెలిపారు. అర్హులైన దళితుంలదరికీ దళిత బంధు అందిస్తామని స్పష్టం చేశారు.

సీఎం సభ జనసమీకరణ కోసం ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించారు. బస్సుల్లో జనాలను తరలించేలా పంతుళ్లకు సూచనలు చేశారు. ఈ నెల 16న మధ్యాహ్నం 2 గంటలకు సమావేశానికి రావాలని కరీంనగర్ డీఈవో ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ నెల 16న కరీంనగర్​ జిల్లా శాలపల్లి ఇందిరానగర్‌లో సీఎం కేసీఆర్ సభ నిర్వహించనున్నారు. ఇందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలోనే కేసీఆర్​.. దళిత బంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం బహిరంగ సభ ఏర్పాట్లపై సీఎస్​ సోమేశ్​ కుమార్​ కరీంనగర్ కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్​, ఇతర అధికారులు పాల్గొన్నారు. గ్రామసభల ద్వారా గ్రామాల్లో దళిత బంధు సాయం పంపిణీ సీఎస్ సోమేశ్​ కుమార్​ తెలిపారు. అర్హులైన దళితుంలదరికీ దళిత బంధు అందిస్తామని స్పష్టం చేశారు.

సీఎం సభ జనసమీకరణ కోసం ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించారు. బస్సుల్లో జనాలను తరలించేలా పంతుళ్లకు సూచనలు చేశారు. ఈ నెల 16న మధ్యాహ్నం 2 గంటలకు సమావేశానికి రావాలని కరీంనగర్ డీఈవో ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి: హుజూరాబాద్​ నియోజకవర్గంలో దళితబంధు కోసం ఎస్సీల ధర్నా

Last Updated : Aug 14, 2021, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.