కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉపఎన్నికల్లో విజయం సాధించిన ఈటల రాజేందర్(Etela Rajender sworn in as MLA).. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ స్పీకర్ ఛాంబర్లో ఆయన చేత స్పీకర్ పోచారం శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈటల వెంట మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్, జితేందర్, వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ ఉన్నారు. అంతకు ముందు గన్పార్కు అమరవీరుల స్థూపం వద్ద ఈటల నివాళులర్పించారు.
![Etela Rajender Oath](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13591468_etela-4.jpg)
గతంలో తెరాస నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్... ఏడోసారి భాజపా అభ్యర్థిగా గెలుపొందారు. అక్టోబర్ 30న ఉపఎన్నికలు జరగ్గా.. నవంబర్ 2న ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్పై ఈటల 23,855 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
![Etela Rajender Oath](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13591468_etela-1.jpg)