కరీంనగర్ జిల్లా :
హుజూరాబాద్
హుజూరాబాద్ మున్సిపాలిటీ పీఠాన్ని తెరాస సొంతం చేసుకుంది. ఛైర్ పర్సన్గా గందె రాధిక, వైస్ ఛైర్ పర్సన్గా కొలిపాక నిర్మల ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేకాధికారి జడ్పీ సీఈవో వెంకట మాధవరావు సమక్షంలో ప్రమాణం స్వీకారం చేశారు.
జమ్మికుంట
జమ్మికుంట మున్సిపాలిటీ అధ్యక్ష స్థానాన్ని తెరాస సాధించింది. ఛైర్మన్గా తక్కలపల్లి రాజేశ్వర్రావు, వైస్ ఛైర్ పర్సన్గా దేశిని స్వప్న ఎన్నికయ్యారు. అనంతరం ప్రత్యేకాధికారి మెప్మా పీడీ నవీన్కుమార్ సమక్షంలో ప్రమాణం స్వీకారం చేశారు.
చొప్పదండి
చొప్పదండి పురపాలక పీఠాన్ని తెరాల కైవసం చేసుకుంది. ఛైర్ పర్సన్గా గుర్రం నీరజ, వైస్ ఛైర్ పర్సన్గా విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఎక్స్ అఫీషియో సభ్యునిగా హాజరయ్యారు. ప్రత్యేక ఎన్నికల అధికారి డీఆర్డీఏ వెంకటేశ్వరావు సమక్షంలో ప్రమాణం స్వీకారం చేశారు.
కొత్తపల్లి
నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ కొత్తపల్లి తెరాస వశమైంది. అధికార పార్టీకి చెందిన రుద్ర రాజు ఛైర్ పర్సన్గా, వైస్ ఛైర్ పర్సన్గా బండ రాధ ఎన్నికయ్యారు.
ఇవీ చూడండి : బస్తీకా బాద్షా: యాదాద్రిలో 5 మున్సిపాలిటీల్లో తెరాస పాగా