కరీంనగర్ జిల్లా రామడుగు మండల తహసీల్దార్ కోమల్ రెడ్డిని దూషించి, విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుపై గంగాధర సింగిల్ విండో మాజీ ఛైర్మన్ కొత్త జైపాల్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలోని రామడుగు, గంగాధర మండలాల సరిహద్దులోని దీపాలకుంట విస్తీర్ణంపై ఉన్న సందిగ్ధాన్ని తొలగించేందుకు రెండు మండలాల తహసీల్దార్లు కోమల్ రెడ్డి, జయంత్లు సర్వే చేపట్టారు.
ఈ తరుణంలో కొత్త జయపాల్ రెడ్డి తమను బెదిరించి, విధులకు ఆటంకం కలిగించారని తహసీల్దార్ కోమల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కోసం జయపాల్ రెడ్డిని గంగాధర పీఎస్కు తరలించేందుకు యత్నించారు. ఈ సమయంలో ఆయన మద్దతుదారులు ఆందోళన చేయడం వల్ల కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఘటనపై విచారణ జరిపిన సీఐ రమేశ్ ఆయనకు స్టేషన్ బెయిల్ మంజూరు చేసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి : మాస్క్ల బజార్ చూసొద్దామా...!