ETV Bharat / state

లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

author img

By

Published : Feb 27, 2020, 10:31 AM IST

Updated : Feb 27, 2020, 2:07 PM IST

అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కరీంనగర్​ జిల్లాలో చోటుచేసుకుంది.

car accident at thimmapur in karimnagar two died
లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ రాజీవ్ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ వైపు నుంచి హైదరాబాద్ వైపు అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

మృతి చెందిన వారిలో ఒకరు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​కు చెందిన వేముల ప్రణయ్ కుమార్, వివేక్ చంద్రగా పోలీసులు గుర్తించారు. అంకరి స్వరాజ్, శివకేశవ్​లు గాయపడ్డారు. వీళ్లంతా విద్యార్థులని.. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

ఇదీ చూడండి: రైలు కింద పడి విద్యార్థిని ఆత్మహత్య

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ రాజీవ్ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ వైపు నుంచి హైదరాబాద్ వైపు అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

మృతి చెందిన వారిలో ఒకరు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​కు చెందిన వేముల ప్రణయ్ కుమార్, వివేక్ చంద్రగా పోలీసులు గుర్తించారు. అంకరి స్వరాజ్, శివకేశవ్​లు గాయపడ్డారు. వీళ్లంతా విద్యార్థులని.. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

ఇదీ చూడండి: రైలు కింద పడి విద్యార్థిని ఆత్మహత్య

Last Updated : Feb 27, 2020, 2:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.