తెరాస సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు వెన్నుదన్నుగా ఉన్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలను కరీంనగర్లో తెరాస అభిమాని అమరావతి సలీం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చౌక్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నగరపాలక సంస్థ మేయర్ సునీల్ రావు హాజరై.. కేకు కట్ చేశారు.
అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. బీద కుటుంబానికి చెందిన మల్లవ్వకు అమరావతి సలీం.. రూ. 50 వేల చెక్కును మేయర్ సునీల్ రావు చేత అందించారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు నిండు నూరేళ్లు జీవించేలే.. ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరారు.
ఇదీ చదవండి: రేపు తెరాస పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్ష సమావేశం