ETV Bharat / state

'స్వశక్తిమాస్క్‌'లతో ఆపత్కాలంలో మహిళలకు ఆదాయం - కరోనా మాస్కులు

కరోనా రోజు రోజుకు దూకుడు పెంచుతోంది.. వైరస్‌ వ్యాప్తి నివారణకు మాస్క్‌లు రక్షణ కవచంగా నిలుస్తున్నాయి.. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం తప్పనిసరి కావడం వల్ల విపణిలో డిమాండ్‌ పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మహిళా సంఘాల సభ్యులు మాస్కుల తయారీలో నిమగ్నమయ్యారు. లాక్‌డౌన్‌ కాలంలో మాస్క్‌లు కడుపు నింపుతున్నాయని స్వశక్తి సభ్యులు పేర్కొంటున్నారు.

మాస్కులు కుడుతున్న మహిళలు
మాస్కులు కుడుతున్న మహిళలు
author img

By

Published : Apr 11, 2020, 3:53 PM IST

రోజు రోజుకూ వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాల్సిన ఆవశ్యకత నెలకొంది. వీటిని తప్పనిసరిగా వాడాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాస్క్‌లు లేకుండా బయటకు వస్తే చర్యలు తీసుకొనేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా.. వైద్యుల సూచనలు పరిగణనలోకి తీసుకొని నాణ్యమైన వస్త్రం ఉపయోగించి కామారెడ్డి జిల్లా మహిళలు వీటిని తయారు చేస్తున్నారు. వీరికి గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు సహకారం అందిస్తున్నారు. లాక్‌డౌన్‌ అమలుతో వస్త్రం కొరత ఏర్పడటంతో కామారెడ్డి జిల్లా పాలనాధికారి శరత్‌ ప్రత్యేక చొరవ తీసుకొని వస్త్ర వ్యాపారులతో చర్చించి సమస్య పరిష్కరించారు.

ఇప్పటికే లక్షకు పైగా మాస్కులు తయారు చేసిన మహిళలు లాభాపేక్ష లేకుండా వీటిని అందజేస్తున్నారు. కేవలం తయారీ వ్యయాన్ని తీసుకొని విక్రయిస్తున్నారు. దీన్ని గమనించి పలు స్వచ్ఛంద సంస్థలు వీరికి ఆర్డర్లు ఇస్తున్నాయి. ఉపాధి గగనమైన ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కుల తయారీతో వచ్చే ఆదాయమే స్వశక్తి మహిళలకు ఆధారమైంది. ఎన్ని ఆర్డర్లు వచ్చినా మాస్కులు తయారీచేసేందుకు స్వశక్తి సంఘాల మహిళలు సిద్ధంగా ఉన్నారని కామారెడ్డి జిల్లా డీఆర్‌డీవో డీపీఎం రమేష్‌బాబు చెబుతున్నారు.

మాస్కుల తయారీ, పంపిణీ వివరాలు
మాస్కుల తయారీ, పంపిణీ వివరాలు

సంప్రదించాల్సిన చరవాణి నంబర్లు

కామారెడ్డి

రమేష్‌బాబు 837 444 6235

నిజామాబాద్‌

సాయిలు 879 099 0105

ఇవీచూడండి: తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రతిభ.. 9 వేలతో బ్యాటరీ సైకిల్

రోజు రోజుకూ వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాల్సిన ఆవశ్యకత నెలకొంది. వీటిని తప్పనిసరిగా వాడాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాస్క్‌లు లేకుండా బయటకు వస్తే చర్యలు తీసుకొనేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా.. వైద్యుల సూచనలు పరిగణనలోకి తీసుకొని నాణ్యమైన వస్త్రం ఉపయోగించి కామారెడ్డి జిల్లా మహిళలు వీటిని తయారు చేస్తున్నారు. వీరికి గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు సహకారం అందిస్తున్నారు. లాక్‌డౌన్‌ అమలుతో వస్త్రం కొరత ఏర్పడటంతో కామారెడ్డి జిల్లా పాలనాధికారి శరత్‌ ప్రత్యేక చొరవ తీసుకొని వస్త్ర వ్యాపారులతో చర్చించి సమస్య పరిష్కరించారు.

ఇప్పటికే లక్షకు పైగా మాస్కులు తయారు చేసిన మహిళలు లాభాపేక్ష లేకుండా వీటిని అందజేస్తున్నారు. కేవలం తయారీ వ్యయాన్ని తీసుకొని విక్రయిస్తున్నారు. దీన్ని గమనించి పలు స్వచ్ఛంద సంస్థలు వీరికి ఆర్డర్లు ఇస్తున్నాయి. ఉపాధి గగనమైన ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కుల తయారీతో వచ్చే ఆదాయమే స్వశక్తి మహిళలకు ఆధారమైంది. ఎన్ని ఆర్డర్లు వచ్చినా మాస్కులు తయారీచేసేందుకు స్వశక్తి సంఘాల మహిళలు సిద్ధంగా ఉన్నారని కామారెడ్డి జిల్లా డీఆర్‌డీవో డీపీఎం రమేష్‌బాబు చెబుతున్నారు.

మాస్కుల తయారీ, పంపిణీ వివరాలు
మాస్కుల తయారీ, పంపిణీ వివరాలు

సంప్రదించాల్సిన చరవాణి నంబర్లు

కామారెడ్డి

రమేష్‌బాబు 837 444 6235

నిజామాబాద్‌

సాయిలు 879 099 0105

ఇవీచూడండి: తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రతిభ.. 9 వేలతో బ్యాటరీ సైకిల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.