ETV Bharat / state

విద్యార్థులు ఆన్​లైన్ పాఠాలు వినేందుకు ఎల్​ఈడీ టీవీల విరాళం - led televisions donation to dongli school

పేద విద్యార్థులు ఆన్​లైన్ పాఠాలు వినేందుకు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం డోంగ్లి జిల్లా పరిషత్ పాఠశాలకు ఓ దాత సాయం చేశారు. 30 వేల నగదుతో పాటు మూడు ఎల్​ఈడీ టీవీలను విరాళంగా అందజేశారు.

led televisions donation to dongli school in kamareddy district
విద్యార్థులు ఆన్​లైన్ పాఠాలు వినేందుకు ఎల్​ఈడీ టీవీల విరాళం
author img

By

Published : Sep 1, 2020, 11:20 AM IST

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం డోంగ్లి జిల్లా పరిషత్​ పాఠశాలలో చదివే విద్యార్థులు ఆన్​లైన్ పాఠాలు వినేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న శివరాజ్ పాటిల్ అనే వ్యక్తి వారికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. పాఠశాలకు 30 వేల నగదుతోపాటు మూడు ఎల్​ఈడీ టీవీలను అందజేశారు. పేద విద్యార్థులకు సాయం చేసిన శివరాజ్ పాటిల్​ను గ్రామస్థులు అభినందించారు.

గతంలోనూ శివరాజ్ లక్షలు విలువ చేసే పరికరాలను పాఠశాలకు అందజేశారని, విద్యార్థులకు సాయం చేయడంలో ఎప్పుడూ ఆయన ముందుంటారని ఉపాధ్యాయులు తెలిపారు.

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం డోంగ్లి జిల్లా పరిషత్​ పాఠశాలలో చదివే విద్యార్థులు ఆన్​లైన్ పాఠాలు వినేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న శివరాజ్ పాటిల్ అనే వ్యక్తి వారికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. పాఠశాలకు 30 వేల నగదుతోపాటు మూడు ఎల్​ఈడీ టీవీలను అందజేశారు. పేద విద్యార్థులకు సాయం చేసిన శివరాజ్ పాటిల్​ను గ్రామస్థులు అభినందించారు.

గతంలోనూ శివరాజ్ లక్షలు విలువ చేసే పరికరాలను పాఠశాలకు అందజేశారని, విద్యార్థులకు సాయం చేయడంలో ఎప్పుడూ ఆయన ముందుంటారని ఉపాధ్యాయులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.