కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తన నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని 28 మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తన నివాసం వద్ద చెక్కులు పంపిణీ చేశారు. తెరాస రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 3,545 మందికి రూ. 35 కోట్ల 09 లక్షల 78 వేల 900 విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిందని తెలిపారు.
![kamareddy mla](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10996174_1064_10996174_1615644173692.png)
అనంతరం దోమకొండ మండలంలోని అంచనూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఇదీ చదవండి: రవాణాశాఖలో ఆన్లైన్లోకి మరో 17 సేవలు